Harish Rao : రేవంత్, ఉత్తంలే తెలంగాణ పాలిట వైట్ ఎలిఫెంట్లు
- ఇంటెలిజెంట్ ఇంజినీర్లే గుర్తించిన లోపాలు
- కానీ ఇప్పుడు బురద చల్లే ప్రయత్నాలు
- రాజకీయ లబ్దికోసం సాంకేతికతను వక్రీకరిస్తున్నారు : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం నిర్మాణంపై ఇష్టారీతిగా వ్యాఖ్యానిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్టే కనిపిస్తుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఒకే అబద్దాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారన్న భ్రమలో ఉన్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంప్హౌజ్లను వాడుకుంటూనే ప్రాజెక్టును ‘వైట్ ఎలిఫెంట్’గా అభివర్ణించడం హాస్యాస్పదమని హరీష్ వ్యాఖ్యానించారు. ఇది కనీస సామాన్య బుద్ధి లేని వ్యవహారమని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రయోజనం కలిగించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏడాదిన్నరుగా కుట్రలు చేయడం తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఒక్క ఎకరాకు నీళ్లు కూడా అందించలేదని విమర్శించారు.
Lion Attack: సింహానికి టచ్ ఇచ్చాడు.. వెంటనే స్ట్రెచర్ ఎక్కాడు..!
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చినట్లు కామెంట్లు చేస్తూ కమిషన్ల కోసమే మార్పు జరిగిందన్న ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కానీ ఫిబ్రవరి 18, 2015, మార్చి 4, 2015 తేదీల్లో సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) పంపిన లేఖల్లో తుమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదని పేర్కొనడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు తెలంగాణకు మంచిచేయక పోయినా, రాష్ట్ర అభివృద్ధి పథంలో వచ్చిన ప్రాజెక్టులపై బురద చల్లే ప్రయత్నాల్లో మాత్రమే తలమునకలై ఉన్నారని హరీష్ రావు అన్నారు. వీరే నిజమైన వైట్ ఎలిఫెంట్లుగా మారారని తీవ్ర విమర్శలు చేశారు. ఒకరు రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతుంటే, మరొకరు నీటి వాటాకు ప్రమాదం కలిగిస్తున్నారని ఆరోపించారు.
Mani Ratnam : భారీ కలెక్షన్స్ కోసమే సినిమాలు చేయొద్దు.. మణిరత్నం హాట్ కామెంట్స్..
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!