పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. శనివారం ఆమెను అరెస్ట్ చేయగా.. న్యాయస్థానం ఆమెను ఐదు రోజులు కస్టడీకి ఇచ్చింది. దీంతో అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు.
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అందరినీ ఆశ్చర్య పరిచింది. పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టు అనంతరం అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి పాకిస్థాన్, చైనాతో సహా అనేక దేశాలకు ప్రయాణించిందని చెబుతున్నారు. కేవలం రూ.20,000 ఉద్యోగంతో ప్రారంభించిన జ్యోతి, ఇప్పుడు ప్రసిద్ధ యూట్యూబర్గా మారింది.
దేశ ద్రోహానికి పాల్పడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హాత్రాకు సంబంధించిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కస్టడీలో ఉన్న జ్యోతిని అధికారులు విచారిస్తున్నారు.
హర్యానా యూట్యూబర్, పాక్ గూఢచారి జ్యోతి మల్హాత్రా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. యూట్యూబ్ ముసుగులో ఆమె చేసిన అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. జ్యోతిని న్యాయస్థానం ఐదురోజులు కస్టడీకి ఇచ్చింది. దీంతో దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
YouTuber Jyoti Malhotra: హర్యానాలోని హిస్సార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసిన కేసులో అరెస్ట్ అయింది. ఈ నేపథ్యంలో విచారణలో కీలక విషయాలను తెలిపినట్లు హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు మల్హోత్రా అనేక సార్లు పాకిస్తాన్, చైనాను సందర్శించారని వెల్లడించారు.
జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు. పాక్కు గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
BJP MP: యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడింది. భారత సైనిక వివరాలతో పాటు పలు సున్నిత వివరాలను పాకిస్తాన్ అధికారులతో పంచుకుంది. దీనికి తోడు ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోని ఓ అధికారితో అత్యంత సన్నిహిత సంబంధాలను ఉన్నట్లు తేలింది. ఈ అధికారిని భారత్ బహిష్కరించింది. పలు సందర్భాల్లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి వచ్చింది. పాకిస్తాన్ హై కమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైంది.
Jyoti Malhotra: సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్. మంచిగానే ఆదాయం వస్తూ ఉంటుంది. అయినా కూడా, హర్యానాకు చెందిన యూట్యూబర్ శత్రుదేశం పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ దొరికిపోయింది. ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాతో పాటు ఆరుగురిని గూఢచర్యం చేస్తున్న కారణంగా ఈ రోజు అరెస్ట్ చేశారు. హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో ప్రముఖ యూట్యూబర్గా పేరు తెచ్చుకున్న జ్యోతి మల్హోత్రా ఈ వ్యవహారంలో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.
పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతికి ఇన్స్టాగ్రామ్తో పాటు యూట్యూబ్లో @Travel with JO పేరుతో ఖాతా ఉంది. ఆమె తన ఇన్స్టా ఖాతాలో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన అనేక వీడియోలు, రీల్స్ను పోస్ట్ చేసింది. పాకిస్థాన్ లో రూపొందించిన రీల్స్, వీడియోల ద్వారా పాక్లో సానుకూల అంశాలను చూయించడానికి ప్రయత్నించింది. పాకిస్థాన్లో చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయంటూ..
పాకిస్థాన్ దేశానికి, సైన్యానికి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్తో సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉంది. వీరు పాక్ ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల్లో "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమె కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది.. 2023లో పాకిస్థాన్ సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె పర్యటన సందర్భంగా..…