YouTuber Jyoti Malhotra: పహల్గామ్ ఉగ్రదాడికి ముందే పాక్, చైనాకు వెళ్లిన జ్యోతి మల్హోత్రా..
- జ్యోతి మల్హోత్రాను విచారిస్తున్న హర్యానా పోలీసులు కేంద్ర దర్యాప్తు సంస్థలు..
- పహల్గామ్ ఉగ్రదాడికి ముందు మల్హోత్రా పాకిస్తాన్, చైనాను సందర్శించినట్లు వెల్లడి..
- జ్యోతి మల్హోత్రాకు నేరుగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్లతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి: హిస్సార్ ఎస్పీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTuber Jyoti Malhotra: హర్యానాలోని హిస్సార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసిన కేసులో అరెస్ట్ అయింది. ఈ నేపథ్యంలో విచారణలో కీలక విషయాలను తెలిపినట్లు హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు మల్హోత్రా అనేక సార్లు పాకిస్తాన్, చైనాను సందర్శించారని వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తమ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థలు హర్యానా పోలీసులకు తెలియజేశాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలువురిపై నిఘా పెట్టి దర్యా్ప్తు చేసి శుక్రవారం నాడు జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ శాశంక్ తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉందన్నారు.
Read Also: Fire Accident: పాతబస్తీ ప్రమాద సమయంలోనే హైదరాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదం.. తేడా ఒక్కటే..!
Also Read
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
ఇక, జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలతో కలిసి విచారిస్తున్నారు. ఆమె ఆదాయ వనరులను గుర్తించడానికి మేము తన ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలనపై ఆరా తీస్తున్నామని హిస్సార్ ఎస్పీ శాశంక్ సావన్ అన్నారు. జ్యోతికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్లతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ధృవీకరించారు. సున్నితమైన రక్షణ సమాచారాన్ని ఆమెకు నేరుగా అందుబాటులో లేనప్పటికీ.. భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన సమయంలో పీఐవోలతో ఆమె సంభాషణ “భయంకరమైనదని పేర్కొన్నారు. ఇక, మల్హోత్రా తన పాకిస్తాన్ పర్యటనల సమయంలో అనేక మంది ఉన్నత స్థాయి వ్యక్తులతో మాట్లాడినట్లు వివరాలను సేకరించాం.. ఇటీవలే ఆమె అరెస్టు జరిగినప్పటికీ, నిఘా సంస్థలు ఇప్పటికే ఆమె కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నాయని ఎస్పీ శాశంక్ కుమార్ సావన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..