Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాలో కనిపించని పశ్చాత్తాపం.. ఐబీ ఆశ్చర్యం
- జ్యోతి మల్హోత్రాలో కనిపించని పశ్చాత్తాపం
- వాక్ స్వేచ్ఛను మాత్రమే వినియోగించుకున్నట్లు వెల్లడి
- విచారణ అధికారులు ఆశ్చర్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. శనివారం ఆమెను అరెస్ట్ చేయగా.. న్యాయస్థానం ఆమెను ఐదు రోజులు కస్టడీకి ఇచ్చింది. దీంతో అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ విచారణంలో ఆమె కూల్గా ఉన్నట్లుగా నివేదికలు అందుతున్నాయి. ఇక ఆమెకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన అధికారులు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్లో ఆమె చాలా ఫ్రీగా మసులుకుంది. అక్కడి మనుషులతో చాలా దగ్గర సంబంధాలు పెట్టుకుంది. వివిధ అధికారులను కూడా పరిచయం చేసుకుంది. ఇక న్యూఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయం అధికారి డానిష్తో ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేంత చనువు కలిగి ఉంది. ఇద్దరూ నవ్వుతూ కనిపించిన వీడియోలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Jyoti Malhotra: భారత్పై ద్వేషం.. పాక్పై మమకారం.. జ్యోతి మల్హోత్రా అలా మారిపోవడానికి కారణమేంటి?
Also Read
జ్యోత్యి మల్హాత్రా పాకిస్థాన్ గుప్పెట్లో ఒక పావుగా మారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమెకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో 450 వీడియోలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తున్నారు. అలాగే ఆమె ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు రాబడుతున్నారు. 2023, 2024, 2025లో ఇలా మూడు సార్లు ఆమె పాకిస్థాన్ సందర్శించింది. 2024లో నెల రోజులు పాకిస్థాన్లోనే ఉండిపోయింది. ఇక పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఇందులో పాకిస్థాన్ తప్పు ఏమీ లేదంటూ ఒక వీడియో పోస్టు చేసింది. పాకిస్థాన్ను సమర్థించి మాట్లాడింది. ఇక విచారణలో తన వాక్ స్వేచ్ఛను మాత్రమే వినియోగించుకున్నట్లు ఆమె చెప్పినట్లు నివేదిక తెలిపింది. విచారణలో ఆమె తీరును చూసి ఐబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు.
ఇది కూడా చదవండి: Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు బయటపెట్టిన తండ్రి..
ఇక ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో పాకిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరిగిపినట్లు గుర్తించారు. డానిష్తో ఉన్న సంబంధాల నేపథ్యంలోనే ఆమె పాకిస్థాన్లో అన్ని ప్రదేశాలకు స్వేచ్ఛగా తిరిగినట్లుగా కనిపెట్టారు. విచారణలో కూడా ఆమె ఈ విషయాన్ని అంగీకరించినట్లు నివేదికలో పేర్కొన్నాయి. డానిష్ కారణంగా పాకిస్థాన్లో పలుచోట్ల జ్యోతికి వీఐపీ ట్రీట్మెంట్ జరిగినట్లుగా గుర్తించారు. అంతేకాకుండా పలుచోట్ల పోలీసులు కూడా భద్రత కల్పించారంటే ఆమె పాకిస్థాన్కు ఎంత దగ్గర అయిపోయిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన ఇఫ్తార్ విందుకు పాక్ హైకమిషన్ జ్యోతికి ప్రత్యేక ఆహ్వానం పంపించారంటే ఆమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఆమె లోపలికి వెళ్లగానే డానిష్ చాలా ప్రత్యేకంగా ఆహ్వానించాడు. అనంతరం ఇద్దరూ చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. ఇక జ్యోతితో సంబంధాలు ఉన్నవారంతా పాక్ జాతీయులతో సంబంధాలు కొనసాగించినట్లు హిసార్ పోలీస్ సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. వీరందరికీ పాక్ అధికారులే స్పాన్సర్ చేసినట్లుగా కనిపెట్టారు.
పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది భర్తలను కోల్పోయి విధవరాళ్లుగా మారిపోతే జ్యోతి మల్హోత్రాలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదంటే.. ఆమె మనసు ఎంత కఠినంగా మారిపోయిందో చెప్పనక్కర్లేదు. పహల్గామ్ వీడియోలను జ్యోతిని పాకిస్థాన్ ఐఎస్ఐకి చేరవేసినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఆ దిశగానే దర్యాప్తు సాగుతోంది.
తాజావార్తలు
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!