Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పూరీ పర్యటనపై పోలీసుల విచారణ..!
- పూరీలో జ్యోతి మల్హోత్రా పర్యటనపై పోలీసులు దర్యాప్తు..
- పూరీలోని శ్రీ క్షేత్రంలో పర్యటించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా..
- శ్రీ క్షేత్రంపై దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం..
- జ్యోతి మల్హోత్రాతో సంబంధం ఉన్న మరో యూట్యూబర్ ప్రియాంక గురించి ఆరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyoti Malhotra: హర్యానాలోని హిస్సార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. తాజాగా జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు. పాక్కు గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, ఆమెకు ఒడిశాలోని పూరీకి చెందిన ప్రియాంకతో మంచి సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఆ విషయాన్ని పూరీ పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
అయితే, 2024 సెప్టెంబర్ 26వ తేదీన పూరీ వచ్చిన జ్యోతి మల్హోత్రా.. ఇక్కడి శ్రీ క్షేత్రాన్ని సందర్శించింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక, శ్రీ క్షేత్రంపై దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథస్వామి దర్శనానికి వచ్చారా? లేక రెక్కీ చేసి.. పాకిస్తాన్ కు ఏమైనా సమాచారం అందించిందా అనే దానిపై అనేక అుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: Anasuya : మా ఇంటికి హనుమాన్ వచ్చాడు.. కొత్త ఇంట్లో అనసూయ కంటతడి..
మరోవైపు, ఒడిశా యూట్యూబర్ ప్రియాంక సేనాపతి 3 నెలల క్రితం పాకిస్తాన్లోని కర్తార్పుర్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె పాక్ కు ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. పాక్ పర్యటనపై సోషల్ మీడియా వేదిక నుంచి ప్రియాంక ఆదివారం నాడు వివరణ ఇచ్చారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ గూఢచారిణి అని నాకు తెలియదు.. పూరీ వచ్చిన ఆమెను ఫ్రెండ్ గానే భావించి.. కలిసి తిరిగాను.. నేను పాక్ కు విహారయాత్ర కోసం మాత్రమే వెళ్లాను.. అంతకుమించి ఏం లేదని తేల్చి చెప్పింది. అవసరమైతే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించింది. హర్యానా పోలీసులతో కలిసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వినీత్ తెలిపారు. పూర్తి వివరాలను ఇప్పుడే చెప్పలేం.. విచారణ కొలిక్కి వచ్చే వరకు ప్రియాంక పూరీ విడిచి వెళ్లరాదన్న ఆదేశాలు జారీ చేశారు. సైబర్ నిపుణులతో కలిసి సదరు యూట్యూబర్ వీడియోలను ఒడిశా పోలీసులు శోధిస్తున్నారు.
తాజావార్తలు
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!