BJP MP: ‘పాక్ స్పై’ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. ఇన్ఫ్లూయెన్సర్లపై చర్యల కోసం బీజేపీ ఎంపీ డిమాండ్..
- సంచలనంగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యం కేసు..
- పాకిస్తాన్ కోసం పనిచేసిన యూట్యూబర్..
- ఇన్ఫ్లూయెన్సర్లపై నియంత్రణ చర్యలు ఉండాలన్న బీజేపీ ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP: యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడింది. భారత సైనిక వివరాలతో పాటు పలు సున్నిత వివరాలను పాకిస్తాన్ అధికారులతో పంచుకుంది. దీనికి తోడు ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోని ఓ అధికారితో అత్యంత సన్నిహిత సంబంధాలను ఉన్నట్లు తేలింది. ఈ అధికారిని భారత్ బహిష్కరించింది. పలు సందర్భాల్లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి వచ్చింది. పాకిస్తాన్ హై కమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైంది.
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. డిజిటల్ ప్లాట్ఫారమ్స్లో తప్పుడు సమాచారం, దుర్వినియోగానికి పాల్పడున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జ్యోతి మల్హోత్రా వ్యవహారం ఆన్లైన్ కంటెంట్ ప్లేస్లో జవాబుదారీతనం కోసం ఒక ముఖ్యమైన పిలుపుగా అభివర్ణించారు. యూట్యూబర్లు, డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్లపై అత్యవసర నియంత్రణ , పర్యవేక్షణ అవసరమని అన్నారు.
Also Read
- NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
Read Also: Hyderabad: హైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం.. భవనంలో చిక్కుకున్న 53 మంది!
క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, పబ్లిక్ ఎంగేజ్మెంట్ ప్రారంభమై, చాలా సందర్భాల్లో తప్పుడు సమాచారం, టార్గెటెడ్ వేధింపులు, రహస్య రాజకీయ ఎజెండా కోసం కొందరు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాక్ స్వేచ్ఛని ఒక కవచం కింద వాడుకుంటున్నారని చెప్పారు. చాందీని చౌక్ ఎంపీగా ఉన్న ఖండేల్వాల్ కంటెంట్ క్రియేటర్ల ప్రవర్తన నియంత్రించడానికి జాతీయ స్థాయిలో ఒక ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యతిరేక, పరువు నష్టం కలిగించే డిజిటల్ ప్రభావాన్ని అడ్డుకోవడం కోసం కఠినమైన మార్గదర్శకాలు అమలు చేయాలని పిలుపునిచ్చారు.
3.77 లక్షల మంది సబ్స్క్రైబర్లు మరియు 1.33 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న యూట్యూబర్ మల్హోత్రా, పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ పట్టుబడింది. ఈమెతో పాటు మొత్తం ఆరుగురిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఆమె మొదటిసారిగా 2023లో పాకిస్తాన్ సందర్శించడానికి వీసా కోసం అఫ్లై చేసుకున్న సమయంలో పాక్ అధికారి ఎహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్తో పరిచయం ఏర్పడింది. దీని తర్వాత ఆమె రెండుసార్లు పాక్ వెళ్లి వచ్చింది. అప్పటి నుంచి పాక్ తరుఫున గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..