BJP MP: ‘పాక్ స్పై’ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. ఇన్ఫ్లూయెన్సర్లపై చర్యల కోసం బీజేపీ ఎంపీ డిమాండ్..
- సంచలనంగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యం కేసు..
- పాకిస్తాన్ కోసం పనిచేసిన యూట్యూబర్..
- ఇన్ఫ్లూయెన్సర్లపై నియంత్రణ చర్యలు ఉండాలన్న బీజేపీ ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP: యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడింది. భారత సైనిక వివరాలతో పాటు పలు సున్నిత వివరాలను పాకిస్తాన్ అధికారులతో పంచుకుంది. దీనికి తోడు ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోని ఓ అధికారితో అత్యంత సన్నిహిత సంబంధాలను ఉన్నట్లు తేలింది. ఈ అధికారిని భారత్ బహిష్కరించింది. పలు సందర్భాల్లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి వచ్చింది. పాకిస్తాన్ హై కమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైంది.
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. డిజిటల్ ప్లాట్ఫారమ్స్లో తప్పుడు సమాచారం, దుర్వినియోగానికి పాల్పడున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జ్యోతి మల్హోత్రా వ్యవహారం ఆన్లైన్ కంటెంట్ ప్లేస్లో జవాబుదారీతనం కోసం ఒక ముఖ్యమైన పిలుపుగా అభివర్ణించారు. యూట్యూబర్లు, డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్లపై అత్యవసర నియంత్రణ , పర్యవేక్షణ అవసరమని అన్నారు.
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
Read Also: Hyderabad: హైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం.. భవనంలో చిక్కుకున్న 53 మంది!
క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, పబ్లిక్ ఎంగేజ్మెంట్ ప్రారంభమై, చాలా సందర్భాల్లో తప్పుడు సమాచారం, టార్గెటెడ్ వేధింపులు, రహస్య రాజకీయ ఎజెండా కోసం కొందరు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాక్ స్వేచ్ఛని ఒక కవచం కింద వాడుకుంటున్నారని చెప్పారు. చాందీని చౌక్ ఎంపీగా ఉన్న ఖండేల్వాల్ కంటెంట్ క్రియేటర్ల ప్రవర్తన నియంత్రించడానికి జాతీయ స్థాయిలో ఒక ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యతిరేక, పరువు నష్టం కలిగించే డిజిటల్ ప్రభావాన్ని అడ్డుకోవడం కోసం కఠినమైన మార్గదర్శకాలు అమలు చేయాలని పిలుపునిచ్చారు.
3.77 లక్షల మంది సబ్స్క్రైబర్లు మరియు 1.33 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న యూట్యూబర్ మల్హోత్రా, పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ పట్టుబడింది. ఈమెతో పాటు మొత్తం ఆరుగురిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఆమె మొదటిసారిగా 2023లో పాకిస్తాన్ సందర్శించడానికి వీసా కోసం అఫ్లై చేసుకున్న సమయంలో పాక్ అధికారి ఎహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్తో పరిచయం ఏర్పడింది. దీని తర్వాత ఆమె రెండుసార్లు పాక్ వెళ్లి వచ్చింది. అప్పటి నుంచి పాక్ తరుఫున గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
-
Hema Slams Anasuya: ‘జై శ్రీరామ్’ ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు… అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
-
Volkswagen Tukan Pickup: వోక్స్వ్యాగన్ టుకాన్ పికప్ ఆవిష్కరణ.. రగ్డ్ డిజైన్, 1.5 TSI హైబ్రిడ్ ఇంజిన్
-
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
-
Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
ట్రెండింగ్
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!