Thota Trimurthulu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందా?.. అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. ప్రభుత్వాలు, అధికారాలు ఎవరికి శాశ్వతం కాదు అన్నారు. కోర్టుల దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లదు.. 200 మంది పోలీసులు వచ్చి ధ్వంసం చేశారు.. ల్యాండ్ సీలింగ్ కేసు ఉందని నా కుటుంబ సభ్యులకు చెందిన చెరువులు ధ్వంసం చేశారు..
Kilari Rosaiah: ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో రోశయ్య, ఉదయ భాను సమావేశం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు.. వరదలు అతలాకుతలం చేశాయి.. అయితే.. వరద ప్రభావిత ప్రాంతాల పునరుద్ధరణ నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు చెక్కులు అందించారు పలువురు దాతలు..
పవన్కళ్యాణ్ విషయంలో చాలా ఎక్కువ చేశామని వైసీపీ ఫీలవుతోందా? దీన్ని ఇంకా సాగదీస్తే… ఓ వర్గం కంప్లీట్గా దూరమవుతుందన్న భయం పార్టీలో పెరిగిపోతోందా? అందుకే అదుపు… అదుపు… మాట పొదుపు అన్న వార్నింగ్స్ వెళ్తున్నాయా? ఆయన్ని చీల్చి చెండాడేద్దామని అనుకుంటే… మనకింకా చీరుకుపోయేట్టుందని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారా? అసలు పవన్ గురించి వైసీపీలో మొదలైన కొత్త చర్చ ఏంటి? పార్టీ ముఖ్యుల అభిప్రాయం ఎలా ఉంది? ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ విషయంలో వైసీపీ వైఖరి ఇన్నాళ్ళు…
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం పార్టీకి గుడ్బై చెప్పేందుకు సిద్ధమయ్యారట.. రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారట జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను.. ఈ నెల 22వ తేదీన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో టచ్లోకి వెళ్లారట ఉదయభాను.. రేపు నియోజక వర్గంలో కార్యకర్తలతో సమావేశం కానున్న ఉదయభాను.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అడుగులు జనసేన పార్టీ వైపు పడుతున్నాయి.. ఇప్పటికే తన రాజీనామా లేఖలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పంపిన బాలినేని.. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు.. ఇక, జనసేన పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లారు బాలినేని.. ఇక, ఈ రోజు విజయవాడలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో భేటీ కానున్నారు బాలినేని.. ఇప్పటికే జనసేన కీలక నేత నాగబాబుతో మంతనాలు…
ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దు అని స్పష్టం చేశారు చంద్రబాబు.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇసుక విషయంలో జోక్యం చేసుకోకుంటే.. రాబోయే రోజుల్లో మన గెలుపునకు అదే దోహదం చేస్తుందన్నారు.. మూడు పార్టీల్లోని ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక విధానాన్ని జయప్రదం చేసేలా సహకరించాలని కోరారు..
విజయవాడలో గురువారం రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలుస్తానని బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణను కూడా అక్కడే ప్రకటిస్తానన్నారు. గతంలో తాను పార్టీలోని కొందరు వ్యక్తుల వల్ల పడుతున్న ఇబ్బందులు పలు సందర్బాల్లో ప్రస్తావించిన బాలినేని.. పార్టీలో తనకు జరిగిన అన్యాయాలను త్వరలో వివరిస్తానని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నేతలకు శుభవార్త చెప్పారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరి నిర్వహించిన ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దుష్ప్రచారాలని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.. మనం చేస్తున్న పనులను చెప్పుకుంటూనే.. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు.. వైఎస్ వివేకా హత్యపై వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోయాం అన్నారు.. ఇక, నామినేటెడ్ పోస్టులు ఉంటాయి..…
మూడు పార్టీలు.. మూడు రకాల స్వభావాలు.. కానీ, ఒకటే ఆలోచన.. ఈ మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే గతం గుర్తొస్తోంది. ఆ రోజుల్లో భయంకరమైన పరిస్థితులుండేవి. పవన్ ఏపీకి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే.. రోడ్డు మార్గంలో వచ్చారు. రోడ్ మార్గంలో కూడా పవన్ను రానివ్వలేదు.