YS Jagan Tirumala Visit: వైఎస్ జగన్ తిరుమల పర్యటన.. ఎన్డీఏ కూటమి నేతల కీలక నిర్ణయం..
- వైఎస్ జగన్ తిరుమల పర్యటన..
- ఎన్డీఏ కూటమి నేతల కీలక నిర్ణయం..
- జగన్ ను అడ్డుకోరాదని నిర్ణయం తీసుకున్న ఎన్డీఏ నేతలు..
- తిరుమలకు జగన్ వెళ్లే దారిలో ఎన్డీఏ కూటమి నేతల శాంతియుత నిరసనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Tirumala Visit: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగిన వేళ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠగా మారింది.. కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు జగన్ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించడంతో.. ఏం జరగబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.. అయితే, ఈ సమయంలో.. తిరుపతిలో సమావేశమైన ఎన్డీఏ కూమటి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, పసుపులేటి హరిప్రసాద్, అజయ్ కుమార్ తదితర నేతలు హాజరు అయ్యారు. ఇక, ఈ సమావేశంలో.. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోరాదని నిర్ణయం తీసుకున్నారు.. తిరుమలకు జగన్ వెళ్లే దారిలో ఎన్డీఏ కూటమి నేతలు శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించారు.. శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీకి జగన్ కారణమని ఎన్డీఎ కూటమి నిరసనకు ప్లాన్ చేసింది.. రాజకీయ బలప్రదర్శనకు వైసీపీ దిగితే దీటుగా సమాధానం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.
Read Also: iPhone 16: పది నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే.?
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. అక్టోబర్ 4వ తేదీ శ్రీవారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.. అక్టోబర్ 2వ తేదీ పవన్ కల్యాణ్ తిరుపతికి వస్తున్నారు.. ప్రాయచ్చిత్త దీక్షను పవన్ కల్యాణ్ తిరుమలలో ముగిస్తారు అని తెలిపారు.. 2వ తేదీన సాయంత్రం 5 గంటలకు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు పవన్ బయలుదేరుతారు.. 3వ తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.. మూడో తేదీ సాయంత్రం తిరుపతిలో వారాహిసభలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని వెల్లడించారు.. వారాహి సభ విజయవంతం చేస్తాం అన్నారు.. మరోవైపు.. శ్రీవారిని దర్శించుకునే అర్హత వైఎస్ జగన్ కు లేదని మండిపడ్డారు.. జగన్ ఐదేళ్లలో తన సతీమణితో కలిసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించ లేదన్న ఆయన.. ఇందిరా గాంధీ, అబ్దుల్ కలామ్ లాంటి వాళ్లు డిక్లరేషన్ ఇచ్చి.. స్వామివారిని దర్శించుకున్నారు.. కానీ, జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామిని దర్శించుకుంటున్నారు అంటూ దుయ్యబట్టారు.. ఇది ఆగమశాస్త్రానికి విరుద్ధం.. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో సంక్షేమం పేరుతో దోచుకున్నారు.. దేవాలయాలను అపవిత్రం చేశారు అని మండిపడ్డారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?