Deputy CM Pawan Kalyan: నేడు జనసేనలోకి కీలక నేతలు.. కండువా కప్పి ఆహ్వానించనున్న పవన్..
- జనసేనలోకి వైసీపీ కీలక నేతలు..
- పార్టీలో చేరనున్న బాలినేని.. సామినేని.. కిలారి రోశయ్య..
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి.. ఎంపీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు.. ఇలా వరుసగా పార్టీకి గుడ్బై చెబుతున్నారు.. ఇప్పటికే పలువురు నేతలు.. టీడీపీ గూటికి చేరగా.. మరికొందరు జనసేన.. ఇంకా కొందరు బీజేపీ కండువాలు కప్పుకున్నారు.. అయితే, ఈ రోజు జనసేన పార్టీలో కీలక నేతలు చేరబోతున్నారు.. సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదబభాను, కిలారి రోశయ్య కూడా ఈ రోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు..
Read Also: IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ముంబై ఇండియన్స్కు భారీ ప్రయోజనం!
Also Read
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
- Ambati Rambabu: రావణ్పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు
- Botsa Satyanarayana: గవర్నర్కు బొత్స లేఖ.. విశాఖలో వద్దు.. విజయనగరం మార్చండి..!
నేడు జనసేనలో చేరనున్నారు వైసీపీ కీలక నేతలు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య.. దీని కోసం మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. మధ్యాహ్నం 12 గంటలకు ఒంగోలు నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బయల్దేరనున్నారు.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.. ఇవాళ అతికొద్ది మంది మాత్రమే బాలినేనితో పాటు పార్టీలో చేరనుండగా.. త్వరలో ఒంగోలు వేదికగా భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇక, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను.. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేయగా.. మధ్యాహ్నం 12 గంటలకు ర్యాలీగా బయల్దేరి జనసేన కార్యాలయానికి చేరుకోనున్నాఉ ఉదయభాను.. మరోవైపు.. ఇటీవలే వైసీపీకి గుడ్బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య.. ఇప్పటికే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సమావేశమై చర్చించారు.. ఆయనతోపాటు వియ్యంకుడు రవిశంకర్ కూడా జనసేన గూటికి చేరనున్నారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన రోశయ్య.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. ఈ రోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు కిలారి రోశయ్య..
తాజావార్తలు
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Akkineni Nagarjuna : అఖిల్కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
ట్రెండింగ్
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!