ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో జనసేన పార్టీకి షాక్ తగిలింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం కో-ఆర్డినేటర్గా ఉన్న పితాని బాలకృష్ణ.. జనసేన పార్టీకి రాజీనామా చేశారు.. ఇక, అధికార వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ అయ్యారు.
తెలుగులో బుల్లితెరకు గ్లామర్ ను పరిచయం చేసిన వ్యక్తి అనసూయ భరద్వాజ్. అనసూయ బుల్లితెరకు పరిచయం కాకముందు ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా కొనసాగే కార్యక్రమాలు అనసూయ రాగానే ఒక్కసారిగా బుల్లితెరపై గ్లామర్ షో పెరిగిపోయింది. అనసూయ తెలుగు బుల్లితెరను అంతలా మార్చేసిందని చెప్పవచ్చు. జబర్దస్త్ షోలో యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి ఆపై అంచయించలుగా ఎదుగుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తన నటనకు మంచి మార్కులు వేపించుకుంది ఈ ముద్దుగుమ్మ. Also Read:…
పార్టీ నిర్వహణ అవసరాలకు రూ.10 కోట్ల విరాళాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ ఉన్నతి కోసం మొదటి నుంచి తన స్వార్జితాన్ని పార్టీ కోసం వెచ్చిస్తూ వస్తున్న పవన్ కల్యాణ్.. ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్వహణ కోసం మరోసారి భారీ విరాళాన్ని అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నంకు విరాళం చెక్కులను అందజేశారు.
Pawan Kalyan: ఏపీ ఎలక్షన్స్ కు రంగం సిద్ధమైంది. ఎవరి ప్రచార వ్యూహాలను వారు సంధిస్తున్నారు. ఇక ఈసారి జనసేన- టీడీపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. తాజాగా నేడు తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ అయిన తెలుగు జన విజయకేతన జెండా సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్.. రెండు తెలుగు రాష్ట్రాలను హీటెక్కిస్తున్నాయి.