PM Modi: “హిందువుల గురించి ప్రశ్నించిన జర్నలిస్టుపై దాడి”.. కాంగ్రెస్పై విరుచుకుపడిన ప్రధాని మోడీ..
- ఇండియా టుడే జర్నలిస్టుపై రాహుల్ టీం దాడి..
- బంగ్లాదేశ్ హిందువుల గురించి ప్రశ్నించడంతో ఘటన..
- జర్నలిస్టుపై దాడి చేయడంతో కాంగ్రెస్పై ప్రధాని మోడీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: అమెరికాలో రాహుల్ గాంధీ టీమ్ ఇండియా టుడే జర్నలిస్టుపై జరిపిన దాడిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్రూరత్వానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో కాశ్మీర్లోని దోడాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అమెరికాలో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఉద్దేశిస్తూ, రాహుల్ గాంధీ ‘మొహబ్బత్కి దుకాన్’ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
‘‘ వారు (కాంగ్రెస్) మొహబ్బత్ కి దుకాన్ నడుపుతున్నట్లు చెప్పుకుంటారు. కానీ మన దేశానికి చెందిన ఒక జర్నలిస్టుపై అమెరికాలో కాంగ్రెస్ క్రూరమైన దాడికి పాల్పడింది. యూఎస్ఏలో భారతదేశ బిడ్డని అవమానించారు. వాక్ స్వాతంత్య్రానికి చాంపియన్లుగా చెప్పుకునే వారు క్రూరత్వంలో మునిగిపోయారు.’’ అని విమర్శించారు. జర్నలిస్టు పట్ల వ్యవహరించిన తీరు అమెరికా గడ్డపై భారతదేశ ప్రతిష్టను తగ్గించిందని ప్రధాని మోదీ అన్నారు. “రాజ్యాంగం” అనే పదం కాంగ్రెస్కు సరిపోదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి మీడియా కీలక స్తంభం, ఓ జర్నలిస్టుని గదిలో బంధించి ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య గౌరవాన్ని చాటి చెప్పే విషయమా..? భారత జర్నలిస్టుపై దాడి చేసి భారతదేశ ప్రతిష్టని పెంచుతున్నారా..? రాజ్యాంగం అనే పదం మీ నోటికి తగదా..? అని ప్రధాని కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడ్డారు.
Also Read
Read Also: Minister Satya Kumar Yadav: ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం.. ఆరోగ్యశ్రీకి రూ.2,500 కోట్ల బకాయిలు..!
ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడాతో డల్లాస్లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడి చేశారని ఇండియా టుడే ప్రతినిధి రోహిత్ శర్మ ఆరోపించారు. రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని చంపడం గురించి శామ్ పిట్రోడాను తాను ప్రశ్నించినప్పుడ, కాంగ్రెస్ బృందంలోని సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేసిటన్లు శర్మ తెలిపారు.
30 నిమిషాల పాటు సాగిన ఈ ఘటనలో తన మొబైల్ ఫోన్ లాక్కున్నారని, ఇంటర్వ్యూ వీడియో మొత్తం డిలీట్ చేశారని రిపోర్టర్ తెలిపారు. తన అనుమతి లేకుండానే కాంగ్రెస్ కార్యకర్తలు తన ఫోన్ని అన్లాక్ చేశారని శర్మ చెప్పారు. ఈ ఘటనపై శామ్ పిట్రోడా స్పందించారు. ‘‘నేను దానిని పరిశీలిస్తాను. ఎవరైనా తప్పుగా ప్రవర్తించడాన్ని నేను ఆమోదించను. జర్నలిస్టులకు గౌరవం ఇవ్వకపోవడాన్ని నేను ఆమోదించను,’’ అని అన్నారు. తాను ఎల్లప్పుడూ జర్నలిస్టులను గౌరవంగా మరియు గౌరవంగా చూస్తానని మరియు “ఫ్రీ ప్రెస్” కోసం నిలబడతానని నొక్కి చెప్పాడు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!