Pahalgam terror attack: ‘‘వెళ్లి మోడీకి చెప్పండి’’.. పహల్గామ్ దాడి తర్వాత టెర్రరిస్టుల పైశాచికం..
- పహల్గామ్ ఉగ్రదాడిలో భయంకర నిజాలు..
- ‘‘మోడీకి వెళ్లి చెప్పు’’ అంటూ టెర్రరిస్ట్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టులను టార్గెట్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా, 12 మంది గాయపడినట్లు చెబుతున్నారు. అయితే, మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ దాడిని ప్రధాని నరేంద్రమోడీ సహా అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. దాడికి పాల్పడినవారిని ఖచ్చితంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు హోం మంత్రి అమిత్ షా ఘటనా స్థలానికి బయలుదేరారు.
అయితే, పక్కా ప్లాన్ ప్రకారమే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు టూరిస్టులపై దగ్గర నుంచి కాల్పులు జరిపారు. పేరు, మతం అడుగుతూ, ఐడెంటిటీ కార్డులు చెక్ చేస్తూ చంపేశారు. ఈ దాడికి సంబంధించిన భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్కతున్నాయి. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఒక వ్యక్తిని కాల్చి చంపిన తర్వాత, టెర్రరిస్టులు అతడి భార్యతో మాట్లాడుతూ.. ‘‘మోడీకి వెళ్లి ఈ విషయం చెప్పు’’ అని అన్నాడు. ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
Read Also: Ahaan Panday: అనన్య పాండే కజిన్ హీరోగా ‘సయారా’… జూలై 18న రిలీజ్!
శివమొగ్గకు చెందిన కుటుంబం సెలవుల్లో కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లింది. మంజునాథ్ అతడి భార్య పల్లి, కొడుకుతో కాశ్మీర్ లోయకు వెళ్లారు. దాడికి సంబంధించిన విషయాలను పల్లవి వివరించారు. “మేము ముగ్గురం – నేను, నా భర్త మరియు మా కొడుకు – కాశ్మీర్కు వెళ్ళాము. ఇది మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జరిగిందని నేను అనుకుంటున్నాను. మేము పహల్గామ్లో ఉన్నాము. అతను నా కళ్ళ ముందు అక్కడికక్కడే మరణించాడు,” అని కన్నీటి పర్యంతమైంది. ఇది ఇప్పటికీ చెడు కలలా ఉందని అన్నారు.
దాడి జరిగిన వెంటను స్థానికులు తమకు సాయం చేయడానికి వచ్చారని పల్లవి చెప్పింది. తనను ముగ్గురు స్థానికులు రక్షించినట్లు చెప్పారు. దాడిలో హిందువుల్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆమె వెల్లడించారు. ‘‘ముగ్గురు నలుగురు వ్యక్తులు మాపై దాడి చేశారు. నా భర్తను చంపారు, నన్ను కూడా చంపేయాలని టెర్రరిస్టులతో నేను అన్నాను. వారిలో ఒకడు, నేను నిన్ను చంపను, వెళ్లి మోడీకి ఈ విషయం చెప్పండి’’ అని అన్నాడు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, X లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్లో దాడిని ఖండించారు. బాధితులకు కర్ణాటక ప్రభుత్వం నుంచి సాయం చేస్తామని, అండగా నిలుస్తామని అన్నారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వివాదాలు, చికాకులు తప్పవు!
-
Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. ‘లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్’ అంటూ ఫైర్!
-
Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో ‘వీరాధి వీరులు’
-
Anirudh Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? ‘జైలర్ 2’ తర్వాత పెళ్లి అంటూ జోరుగా ప్రచారం..
-
Allu Arjun : అల్లుఅర్జున్ ‘రాకా’ 2027లో రావడం కూడా కష్టమేనా.?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!