Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Go And Tell Modi Terrorists Chilling Comments After Pahalgam Attack

Pahalgam terror attack: ‘‘వెళ్లి మోడీకి చెప్పండి’’.. పహల్గామ్ దాడి తర్వాత టెర్రరిస్టుల పైశాచికం..

NTV Telugu Twitter
Published Date :April 22, 2025 , 7:35 pm
By venugopal reddy
  • పహల్గామ్ ఉగ్రదాడిలో భయంకర నిజాలు..
  • ‘‘మోడీకి వెళ్లి చెప్పు’’ అంటూ టెర్రరిస్ట్ కామెంట్స్..
Pahalgam terror attack: ‘‘వెళ్లి మోడీకి చెప్పండి’’.. పహల్గామ్ దాడి తర్వాత టెర్రరిస్టుల పైశాచికం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టులను టార్గెట్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా, 12 మంది గాయపడినట్లు చెబుతున్నారు. అయితే, మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ దాడిని ప్రధాని నరేంద్రమోడీ సహా అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. దాడికి పాల్పడినవారిని ఖచ్చితంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు హోం మంత్రి అమిత్ షా ఘటనా స్థలానికి బయలుదేరారు.

అయితే, పక్కా ప్లాన్ ప్రకారమే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు టూరిస్టులపై దగ్గర నుంచి కాల్పులు జరిపారు. పేరు, మతం అడుగుతూ, ఐడెంటిటీ కార్డులు చెక్ చేస్తూ చంపేశారు. ఈ దాడికి సంబంధించిన భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్కతున్నాయి. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఒక వ్యక్తిని కాల్చి చంపిన తర్వాత, టెర్రరిస్టులు అతడి భార్యతో మాట్లాడుతూ.. ‘‘మోడీకి వెళ్లి ఈ విషయం చెప్పు’’ అని అన్నాడు. ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Read Also: Ahaan Panday: అనన్య పాండే కజిన్ హీరోగా ‘సయారా’… జూలై 18న రిలీజ్!

శివమొగ్గకు చెందిన కుటుంబం సెలవుల్లో కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లింది. మంజునాథ్ అతడి భార్య పల్లి, కొడుకుతో కాశ్మీర్ లోయకు వెళ్లారు. దాడికి సంబంధించిన విషయాలను పల్లవి వివరించారు. “మేము ముగ్గురం – నేను, నా భర్త మరియు మా కొడుకు – కాశ్మీర్‌కు వెళ్ళాము. ఇది మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జరిగిందని నేను అనుకుంటున్నాను. మేము పహల్గామ్‌లో ఉన్నాము. అతను నా కళ్ళ ముందు అక్కడికక్కడే మరణించాడు,” అని కన్నీటి పర్యంతమైంది. ఇది ఇప్పటికీ చెడు కలలా ఉందని అన్నారు.

దాడి జరిగిన వెంటను స్థానికులు తమకు సాయం చేయడానికి వచ్చారని పల్లవి చెప్పింది. తనను ముగ్గురు స్థానికులు రక్షించినట్లు చెప్పారు. దాడిలో హిందువుల్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆమె వెల్లడించారు. ‘‘ముగ్గురు నలుగురు వ్యక్తులు మాపై దాడి చేశారు. నా భర్తను చంపారు, నన్ను కూడా చంపేయాలని టెర్రరిస్టులతో నేను అన్నాను. వారిలో ఒకడు, నేను నిన్ను చంపను, వెళ్లి మోడీకి ఈ విషయం చెప్పండి’’ అని అన్నాడు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, X లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్‌లో దాడిని ఖండించారు. బాధితులకు కర్ణాటక ప్రభుత్వం నుంచి సాయం చేస్తామని, అండగా నిలుస్తామని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • jammu kashmir
  • Kashmir terror attack
  • Pahalgam terror attack
  • Pahalgam terrorist attack

తాజావార్తలు

  • IPL Winner 2025 RCB: 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. IPL 2025 విజేతగా ఆర్సీబి..!

  • Off The Record : కాంగ్రెస్ లో చిచ్చు పెట్టిన ఎమ్మెల్యే, ఎంపీ భేటీ

  • Bhairavam : ‘వీరమల్లు’ వచ్చే దాకా మా మూవీ చూడండి.. భైరవం హీరోలు

  • Infinix GT 30 Pro: 6.78-అంగుళాల స్క్రీన్, 108MP కెమెరా, అదిరిపోయే గేమింగ్ ఫీచర్లతో ఇన్‌ఫినిక్స్ GT 30 ప్రో లాంచ్..!

  • Virat Kohli : ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లీ

ట్రెండింగ్‌

  • Realme Buds T200x: అత్యాధునిక ANC ఫీచర్స్, మెరుగైన సౌండ్ క్వాలిటీతో కొత్త TWS ఎయిర్‌బడ్స్ లాంచ్..!

  • Realme C73 5G: కేవలం రూ.10,499లకే 6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌తో రియల్‌మీ C73 5G భారత్‌లో లాంచ్..!

  • Rohit Sharma: నన్ను ఔట్ చేయడం సాధ్యమే కాదు.. పిల్లలతో హిట్ మ్యాన్.. వీడియో వైరల్

  • Xiaomi: షావోమి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. ఆ ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఉండవు..!

  • Vivo T4 Ultra: 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో భారత్ లో లాంచ్ కి సిద్దమైన వివో T4 అల్ట్రా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions