Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Pakistan Army Chiefs Comments On Kashmir Pahalgam Terror Attack

Pahalgam terror attack: కాశ్మీర్‌పై పాక్ ఆర్మీ చీఫ్ విద్వేష వ్యాఖ్యలు.. అంతలోనే పహల్గామ్ ఉగ్రదాడి..

Published Date :April 22, 2025 , 8:19 pm
By Venu Goapl Reddy
  • కాశ్మీర్‌పై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ విద్వేష వ్యాఖ్యలు..
  • రోజుల వ్యవధిలోనే పహల్గామ్‌లో ఉగ్రదాడి..
  • 27 మంది టూరిస్టుల మృతి..
Pahalgam terror attack: కాశ్మీర్‌పై పాక్ ఆర్మీ చీఫ్ విద్వేష వ్యాఖ్యలు.. అంతలోనే పహల్గామ్ ఉగ్రదాడి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. కాశ్మీర్ అందాలు చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని టార్గెట్ చేసి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ప్రస్తుతం వస్తున్న వివరాల ప్రకారం, 27 మంది వరకు టూరిస్టులు ఈ దాడిలో మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఇజ్రాయిల్, ఇటలీ దేశస్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిని ప్రధాని మోడీ సహా హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు.

అయితే, ఈ దాడికి పాల్పడినట్లు లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ బాధ్యత ప్రకటించుకుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ జమ్మూ కాశ్మీర్ గురించి కామెంట్స్ చేసిన కొన్ని రోజులకే ఈ దారుణమైన ఉగ్రదాడి జరగడం పాక్ ప్రమేయాన్ని సూచిస్తోంది. గత వారం ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘‘కాశ్మీర్ సోదరులను మేం వదిలేయమని, వాళ్లకోసం నిరంతరం పోరాడుతూ ఉంటాము. కాశ్మీర్ మా జీవనాడి’’ అని అన్నారు. పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తామని చెప్పకనే చెప్పారు

Also Read

  • Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
  • West Bengal: దిగిపోయిన దీదీ.. రాబోతున్న బీజేపీ! మే 9న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..
  • West Bengal: బీజేపీ విజయం తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం.. భక్తుల్లో ఆనందోత్సాహం
  • Congress Comeback: ఐదు రాష్ట్రాల పోరులో అతిపెద్ద లబ్ధిదారు కాంగ్రెస్సే ! బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే..

Read Also: Terror Attack: ఉగ్రదాడిలో 27 మంది మృతి?.. మరణించిన వారిలో ఇజ్రాయెల్, ఇటాలియన్ టూరిస్టులు!

కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో సరిహద్దు వెంబడి ఉగ్రతండాలను నిర్వహిస్తోంది. తాజాగా, ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే, పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ప్రస్తుతం, జమ్మూ కాశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదులు తగ్గారు. ఆ ప్రాంతంలో 70 మంది వరకు విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీరంతా పాకిస్తాన్ నుంచి బోర్డర్ దాడి, అడవులు, కొండల మాటున కాశ్మీర్‌లోకి వచ్చారు. అదును చూసి ఈ రోజు టూరిస్టుల్ని టార్గెట్ చేశారు.

గత కొంత కాలంగా టెర్రరిస్టులు టార్గెటెడ్ దాడులకు, ఆర్మీపై దాడులకు పరిమితమయ్యారు. స్థానికేతరులను చంపడం, ఆర్మీ వాహనాపై దాడులు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇలా టూరిస్టులను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి. పక్కా ప్లాన్‌తో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ప్రజల్ని మభ్య పెట్టారు. టూరిస్టుల్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ దాడిపై సమాచారం అందిన వెంటనే హోంమంత్రి సంఘటన స్థలానికి బయలుదేరారు. ఈ దాడిపై ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఎంపీ సుచేంద్ర కుమార్ ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • Asim Munir
  • jammu kashmir
  • Kashmir terror attack
  • Pahalgam terror attack

తాజావార్తలు

  • Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!

  • Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం

  • Gudivada Amarnath: జగన్‌ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!

  • West Bengal: దిగిపోయిన దీదీ.. రాబోతున్న బీజేపీ! మే 9న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..

  • Bollywood : బాలీవుడ్‌లో సత్తా చాటలేకపోతున్న సౌత్‌ స్టార్స్‌.. ఇక్కడ టాప్‌ పొజిషన్‌.. హిందీలో ఫ్లాపులు

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions