Pahalgam terror attack: ఆర్మీ యూనిఫాంలో టెర్రరిస్టులు.. “ముస్లిం” కాదని కాల్పులు..
- ఆర్మీ యూనిఫాం ధరించి పక్కా ప్లాన్తో టెర్రిస్టుల దాడి..
- టూరిస్టులను చుట్టుముట్టి దాడికి పాల్పడిన ఉగ్రవాదులు..
- పేరు, మతం అడిగి కాల్పులు జరిపారని తెలిపిన ప్రత్యక్ష సాక్షులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, అనధికారికంగా మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుదనే వార్తలు వినిపిస్తున్నాయి. పహల్గామ్లోని బైసరన్ గడ్డి మైదానాలను చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. పక్కా పథకం ప్రకారమే దాడి చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Gudivada Amarnath: షెల్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారు..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
టెర్రరిస్టులు ఆర్మీ యూనిఫాం ధరించి, ప్రజల్ని మభ్య పెట్టారు. టెర్రరిస్టులు ట్రెక్కింగ్ చేస్తున్న వారిపై అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. మొత్తం ఏడుగురు టెర్రరిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది మేమే అని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ బాధ్యత ప్రకటించుకుంది. ఈ దాడిపై ప్రధాని మోడీ సౌదీ నుంచి ఆరా తీశారు. సంఘటన స్థలానికి వెళ్లాలని హోంమంత్రి అమిత్ షాని ఆదేశించారు.
దాడికి సంబంధించిన భయానక సన్నివేశాలను ప్రత్యక్ష సాక్ష్యులు పంచుకున్నారు. ‘‘మేము భేల్పురి తింటున్నాము. ఆ సమయంలో టెర్రరిస్టులు తన భర్తని కాల్చారు.’’ అని భయపడుతున్న గొంతుతో ఒక మహిళ చెప్పింది. ‘‘నా భార్త ముస్లిం కాదని చెబుతూ టెర్రరిస్టులు అతడిని కాల్చారు’’ అని చెప్పారు. టెర్రరిస్టులు ముఖ్యంగా ముస్లిం కాని వారిని టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. టూరిస్టుల పేరు, మతం అడిగి టెర్రరిస్టులు దారుణానికి ఒడిగట్టారు. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో మహిళ, తన భర్త ప్రాణాలు కాపాడాలంటూ కన్నీటితో వేడుకుంటున్న వీడియో కనిపించింది. దాడి తర్వాత, సంఘటనా స్థలానికి చేరకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఉగ్రవాదుల వేట ప్రారంభమైంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!