Pahalgam terror attack: ఆర్మీ యూనిఫాంలో టెర్రరిస్టులు.. “ముస్లిం” కాదని కాల్పులు..
- ఆర్మీ యూనిఫాం ధరించి పక్కా ప్లాన్తో టెర్రిస్టుల దాడి..
- టూరిస్టులను చుట్టుముట్టి దాడికి పాల్పడిన ఉగ్రవాదులు..
- పేరు, మతం అడిగి కాల్పులు జరిపారని తెలిపిన ప్రత్యక్ష సాక్షులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, అనధికారికంగా మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుదనే వార్తలు వినిపిస్తున్నాయి. పహల్గామ్లోని బైసరన్ గడ్డి మైదానాలను చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. పక్కా పథకం ప్రకారమే దాడి చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Gudivada Amarnath: షెల్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారు..
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
టెర్రరిస్టులు ఆర్మీ యూనిఫాం ధరించి, ప్రజల్ని మభ్య పెట్టారు. టెర్రరిస్టులు ట్రెక్కింగ్ చేస్తున్న వారిపై అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. మొత్తం ఏడుగురు టెర్రరిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది మేమే అని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ బాధ్యత ప్రకటించుకుంది. ఈ దాడిపై ప్రధాని మోడీ సౌదీ నుంచి ఆరా తీశారు. సంఘటన స్థలానికి వెళ్లాలని హోంమంత్రి అమిత్ షాని ఆదేశించారు.
దాడికి సంబంధించిన భయానక సన్నివేశాలను ప్రత్యక్ష సాక్ష్యులు పంచుకున్నారు. ‘‘మేము భేల్పురి తింటున్నాము. ఆ సమయంలో టెర్రరిస్టులు తన భర్తని కాల్చారు.’’ అని భయపడుతున్న గొంతుతో ఒక మహిళ చెప్పింది. ‘‘నా భార్త ముస్లిం కాదని చెబుతూ టెర్రరిస్టులు అతడిని కాల్చారు’’ అని చెప్పారు. టెర్రరిస్టులు ముఖ్యంగా ముస్లిం కాని వారిని టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. టూరిస్టుల పేరు, మతం అడిగి టెర్రరిస్టులు దారుణానికి ఒడిగట్టారు. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో మహిళ, తన భర్త ప్రాణాలు కాపాడాలంటూ కన్నీటితో వేడుకుంటున్న వీడియో కనిపించింది. దాడి తర్వాత, సంఘటనా స్థలానికి చేరకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఉగ్రవాదుల వేట ప్రారంభమైంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?