Congress: పహల్గామ్ ఉగ్రదాడి.. బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..
- పహల్గామ్ ఉగ్రదాడిలో 27 మంది మృతి..
- దాడిని ఖండిస్తూనే, బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: జమ్మూ కాశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్లో టూరిస్టుల్ని టార్గెట్ చేస్తూ, ఉగ్రవాదులు దారణమైన దాడికి పాల్పడ్డారు. పక్కా పథకంలో వచ్చిన టెర్రరిస్టులు, అమాయకులైన పర్యాటకుల ప్రాణాలు తీశారు. మంగళవారం జరిగిన ఈ దాడిలో 27 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ దాడికి సంబంధించి ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. అత్యున్నత సమావేశం కోసం అమిత్ షా హుటాహుటిన శ్రీనగర్ వెళ్లారు.
Read Also: Health Tips: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే చాలు.. ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు
Also Read
- Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
- UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
ఇదిలా ఉంటే, ఈ దాడిపై కాంగ్రెస్ నేత, పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించామని, సాధారణ పరిస్థితిని పునరుద్ధరించామని ‘‘ఖాళీ వాదనలు’’ చేయడానికి బదులుగా కేంద్రం బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పర్యాటకులపై దాడి హృదయ విదారకంగా ఉందని అన్నారు. ‘‘జమ్మూ కాశ్మీర్లో ఖాళీ వాదనలు చేయడానికి బదులుగా, ప్రభుత్వం జవాబుదారీతనం వహించి, భవిష్యత్తులో ఇలాంటి అనాగరిక సంఘటనలు జరగకుండా, అమాయక భారతీయులు ఇలా ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందిస్తూ, ఇది మానవత్వంపై మచ్చగా అభివర్ణించారు. ఉగ్రవాదులపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని అధికార బీజేపీని కోరారు .”దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి, దానిని తీవ్రంగా ఖండిస్తుంది” అని ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టామని గతంలో చెప్పిన బీజేపీ, ఇప్పుడు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
जम्मू-कश्मीर के पहलगाम में हुए कायराना आतंकी हमले में पर्यटकों के मारे जाने और कई लोगों के घायल होने की ख़बर बेहद निंदनीय और दिल दहलाने वाली है।
मैं शोकाकुल परिवारों के प्रति गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के जल्द स्वस्थ होने की आशा करता हूं।
आतंक के खिलाफ पूरा देश…
— Rahul Gandhi (@RahulGandhi) April 22, 2025
I strongly condemn the cowardly terror attack on innocent tourists in Pahalgam, Jammu & Kashmir. The entire nation is united in fighting the scourge of cross-border terrorism.
These dastardly targeted attacks are a blot on humanity. News reports indicate that precious lives…
— Mallikarjun Kharge (@kharge) April 22, 2025
తాజావార్తలు
-
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
-
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?