మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది… అయితే, ఈ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి… కమ్యూనిస్టులకు చెప్పుకోదగిన ఓటింగ్ ఉండడంతో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వారితో పొత్తుకోసం ప్రయత్నాలు చేశాయి.. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఓడించాలంటే.. టీఆర్ఎస్కే సాధ్యం.. అందుకే.. తమ మద్దతు.. గులాబీ పార్టీకేనని ప్రకటించాయి సీపీఎం, సీపీఐ.. అయితే, మంత్రులు కేటీఆర్, జగదీష్రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక విషయంలో చేసిన కామెంట్లను…
కేంద్రం రాజగోపాల్ కాంట్రాక్ట్ డబ్బులు మునుగోడుకి ఇవ్వాలని మంత్రి కోరారు. 18 వేల కోట్లకు రాజగోపాల్ అమ్ముడు పోయారని ఆరోపించారు. రాజగోపాల్ కు డెడ్ లైన్ పెడుతున్నానని, తన సవాల్ స్వీకరించాలని అన్నారు.
పూటకో మాట కోమటిరెడ్డి బ్రదర్స్ నైజం అని మంత్రి జగరదీశ్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. రాజ్ గోపాల్ రెడ్డి అమ్ముడుపోయిన వ్యవహారంను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నామని అన్నారు. 20వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకున్నట్టు రాజ్ గోపాల్ రెడ్డి ఒప్పుకున్నారని గుర్తు చేశారు జగదీశ్ రెడ్డి.
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బీజేపీ ఆగడాలను అడ్డుకునేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
నాగార్జునసాగర్ ఎడమ కాలువ కు గండిపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. సాగర్ ఎడమ కాలువ కట్ట నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. రాబోయే ఐదు ఆరు రోజుల్లో కాలువలో నీటిని పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.