Israel: ఇరాన్కు ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం రోజురోజు తీవ్రం అవుతోంది. గత శనివారం జరిగిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని యూఎస్, ఇజ్రాయిల్ చంపేశాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికకు సంబంధించిన కార్యక్రమాలను ఇరాన్ చేపట్టింది. ఖమేనీ వారసుడిగా ఆయన కొడుకు కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. ఇరాన్ మిలిటరీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) మద్దతు ఖమేనీ కుమారుడు మొజ్తాబాకు ఉంది.…
విమాన ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్న్యూస్ చెప్పింది. గత 5 రోజులుగా ఇరాన్పై యుద్ధం కారణంగా పశ్చిమాసియా సహా గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో గగనతలం మూసేయడంతో విమాన ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు.
గత నెల 28న అకస్మాత్తుగా ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసి అత్యున్నత పదవిలో ఉన్న అయతుల్లా ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, అధికార పెద్దలను అంతమొందించింది.
పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధ భయాలు నెలకొన్న తరుణంలో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువులతో పాటు ఆభరణాల ధరలు కూడా పెరగొచ్చని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.
దేశీయ మార్కెట్కు పశ్చిమాసియా యుద్ధ భయం పట్టుకుంది. గత మూడు రోజులుగా మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం తర్వాత మధ్యప్రాచ్యంలో భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది.
అమెరికా, ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో అమెరికా కార్యాలయాలు, వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా దుబాయ్లోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడి చేసింది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా అలీ ఖమేనీ (56) ఎన్నికయ్యారు. 80 మందితో కూడిన పండితుల కమిటీ మోజ్తబా పేరును ఆమోదించినట్లుగా ఇరాన్ మీడియా పేర్కొంది.
Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్పై స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశానికి సహజవాయువు సరఫరాదారుగా ఉన్న ఖతార్, ఇరాన్ దాడులతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్కు ఖతార్ LNG ఎగుమతులను 40 శాతం వరకు తగ్గించింది. ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారుగా ఉంది. Read Also: T20 World Cup Semi-final: చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. టీమ్ ఇండియా ప్రాక్టీస్ వాయిదా.. ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది.…
India Russia: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. యూఎస్ ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేయడం గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలకు కారణమైంది. మరోవైపు అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రైయిన్, సౌదీ అరేబియాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసివేసింది. ప్రపంచంలో 20 శాతం చమురు రవాణా ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇరుకైన సముద్ర మార్గాన్ని ఇరాన్ మూసేయడంతో…