Benjamin Netanyahu: మేం ప్రపంచం కోసం పోరాడుతున్నాం, మాతో కలిసి రండి..
- మేం ప్రపంచం కోసం పోరాడుతున్నాము..
- మాకు సహకరించాలి..
- ప్రపంచ దేశాలను కోరిన నెతన్యాహూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం రోజురోజు తీవ్రంగా మారుతోంది. ఈ ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యామూ ఆదివారం ఇరాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయిల్కు మాత్రమే ప్రమాదం కాదని, యావత్ ప్రపంచానికి ప్రమాదమని హెచ్చరించారు. శనివారం ఇజ్రాయిల్లోని అరద్ నగరంపై ఇరాన్ క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల తర్వాత ఆయన అరద్లో పర్యటించించారు.
డియాగో గార్సియాపై ఇటీవల జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, నెతన్యాహు ప్రపంచాన్ని హెచ్చరించారు. ఇరాన్ 4,000 కిలోమీటర్ల పరిధి గల క్షిపణిని ప్రయోగించిందని ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రకారం, ఇరాన్కు ఇప్పుడు యూరప్లోని లోపలి ప్రాంతాలలో కూడా విధ్వంసం సృష్టించే సామర్థ్యం ఉందని తాను చాలాకాలంగా చెబుతూ వస్తున్నానని తెలిపారు. ఇరాన్ ఇప్పటిక సైప్రస్, యూరోపియన్ దేశాలు లక్ష్యంగా దాడులు చేస్తోందని అన్నారు. గత 48 గంటల్లో నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేసిందిని ఇజ్రాయిల్ ప్రధాని చెప్పారు. ఇరాన్ సామూహిక మారణహోమానికి ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.
Also Read
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Trump: ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తవుతుంది.. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్కు వార్నింగ్
- Trump: ఫుట్బాల్ ప్లేయర్ నిషేధంపై ట్రంప్ సమీక్ష.. దుమారం రేపుతోన్న అధ్యక్షుడి తీరు
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
Read Also: Israel: ఇజ్రాయెల్ అణ్వాయుధ రహస్యం.. ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ ‘చివరి నిర్ణయం’ ఏమిటి..?
జెరూసలేం లాంటి పవిత్ర ప్రాంతాలపై దాడుల్ని నెతన్యాహూ ప్రస్తావించారు. యూదులు, ఇస్లాం, క్రైస్తవానికి ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలపై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగించిందని అన్నారు. వెస్ట్రన్ వాల్, చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్ , అల్-అక్సా మసీదులను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్షిపణుల శకలాలు ఈ ప్రాంతాల్లో పడ్డాయని చెప్పారు.
ఈ తీవ్రవాద పాలనకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విజ్ఞప్తికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గట్టిగా మద్దతు తెలిపారు. యావత్ ప్రపంచ భద్రత కోసం ఇజ్రాయెల్, అమెరికా కలిసి పోరాడుతున్నాయని నెతన్యాహు పేర్కొన్నారు. ఇంధన సరఫరా, సముద్ర మార్గాలను అడ్డుకోవడం ద్వారా ఇరాన్ బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోందని, ఈ చర్యలకు ప్రపంచం మొత్తం ఏకం కావాలని నెతన్యాహూ కోరారు. ఇరాన్ మిస్సైల్ ప్రోగ్రాం నాశనం చేయడం, అక్కడి ప్రజలు నియంతృత్వాన్ని కూలదోసేలా చేయడం తమ లక్ష్యాలని నెతన్యాహూ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!