Benjamin Netanyahu: మేం ప్రపంచం కోసం పోరాడుతున్నాం, మాతో కలిసి రండి..
- మేం ప్రపంచం కోసం పోరాడుతున్నాము..
- మాకు సహకరించాలి..
- ప్రపంచ దేశాలను కోరిన నెతన్యాహూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం రోజురోజు తీవ్రంగా మారుతోంది. ఈ ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యామూ ఆదివారం ఇరాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయిల్కు మాత్రమే ప్రమాదం కాదని, యావత్ ప్రపంచానికి ప్రమాదమని హెచ్చరించారు. శనివారం ఇజ్రాయిల్లోని అరద్ నగరంపై ఇరాన్ క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల తర్వాత ఆయన అరద్లో పర్యటించించారు.
డియాగో గార్సియాపై ఇటీవల జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, నెతన్యాహు ప్రపంచాన్ని హెచ్చరించారు. ఇరాన్ 4,000 కిలోమీటర్ల పరిధి గల క్షిపణిని ప్రయోగించిందని ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రకారం, ఇరాన్కు ఇప్పుడు యూరప్లోని లోపలి ప్రాంతాలలో కూడా విధ్వంసం సృష్టించే సామర్థ్యం ఉందని తాను చాలాకాలంగా చెబుతూ వస్తున్నానని తెలిపారు. ఇరాన్ ఇప్పటిక సైప్రస్, యూరోపియన్ దేశాలు లక్ష్యంగా దాడులు చేస్తోందని అన్నారు. గత 48 గంటల్లో నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేసిందిని ఇజ్రాయిల్ ప్రధాని చెప్పారు. ఇరాన్ సామూహిక మారణహోమానికి ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
Read Also: Israel: ఇజ్రాయెల్ అణ్వాయుధ రహస్యం.. ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ ‘చివరి నిర్ణయం’ ఏమిటి..?
జెరూసలేం లాంటి పవిత్ర ప్రాంతాలపై దాడుల్ని నెతన్యాహూ ప్రస్తావించారు. యూదులు, ఇస్లాం, క్రైస్తవానికి ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలపై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగించిందని అన్నారు. వెస్ట్రన్ వాల్, చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్ , అల్-అక్సా మసీదులను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్షిపణుల శకలాలు ఈ ప్రాంతాల్లో పడ్డాయని చెప్పారు.
ఈ తీవ్రవాద పాలనకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విజ్ఞప్తికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గట్టిగా మద్దతు తెలిపారు. యావత్ ప్రపంచ భద్రత కోసం ఇజ్రాయెల్, అమెరికా కలిసి పోరాడుతున్నాయని నెతన్యాహు పేర్కొన్నారు. ఇంధన సరఫరా, సముద్ర మార్గాలను అడ్డుకోవడం ద్వారా ఇరాన్ బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోందని, ఈ చర్యలకు ప్రపంచం మొత్తం ఏకం కావాలని నెతన్యాహూ కోరారు. ఇరాన్ మిస్సైల్ ప్రోగ్రాం నాశనం చేయడం, అక్కడి ప్రజలు నియంతృత్వాన్ని కూలదోసేలా చేయడం తమ లక్ష్యాలని నెతన్యాహూ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!