Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీపై మొసాద్, సీఐఏ గురి..
- మొజ్తబా ఖమేనీపై మొసాద్, సీఐఏ గురి..
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎక్కడ..?
Mojtaba Khamenei: ఇజ్రాయిల్, అమెరికా దాడి చేసిన తొలి రోజే ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేశాయి. అయితే, ఇప్పుడు కొత్తగా ఇరాన్ అత్యున్నత నేతగా ఎన్నికైన అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ కొసం ఇజ్రాయిల్, అమెరికా గూఢచార సంస్థలు మొసాద్, సీఐఏలు ఇరాన్ వ్యాప్తంగా వెతుకున్నాయి. ఈ దాడుల్లో మొజ్తబా ఖమేనీ భార్య, కుమారుడు కూడా మరణించారు. అయితే, మార్చి 09న కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికైనప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. ఒకటి రెండు సార్లు ఆయన ప్రకటనల్ని ఇరాన్ స్టేట్ మీడియా చదివింది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు సీఐఏ, మొసాద్ సంస్థలు ఇప్పుడు మొజ్తబా గురించి వెతుకుతున్నాయి. ముఖ్యంగా తన తండ్రి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పర్షియన్ నూతన సంవత్సరం ‘‘నౌరూజ్’’ సమయంలో దేశ ప్రజలకు సందేశం ఇస్తాడని అంతా ఎదురుచూశారు. అయితే, ఆయన కేవలం లిఖితపూర్వక ప్రకటన మాత్రమే చేశారు. దీంతో మొజ్తబా ఆరోగ్యం, అతడి అదృశ్యం గురించి మిస్టరీ తీవ్రమవుతోంది.
Also Read
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
ఆక్సియోస్ నివేదిక ప్రకారం.. ఇరాన్ అధికారులు అతనితో సమావేశాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం వంటి ఆధారాలను బట్టి చూస్తే, మొజ్తబా ఇంకా సజీవంగా ఉన్నాడని అమెరికా, ఇజ్రాయిల్ గూఢచార సంస్థల వద్ద సమాచారం ఉందని తెలుస్తోంది. ఇది అత్యంత విచిత్రంగా ఉంది. ఒక మరణించిన వ్యక్తిని సుప్రీం లీడర్గా ఎన్నుకోవడానికి ఇరాన్ వారు ఇంత శ్రమపడి ఉంటారని మేము అనుకోవడం లేదు; కానీ అదే సమయంలో, అతను నిజంగా నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తున్నాడనడానికి కూడా మా వద్ద ఎటువంటి రుజువు లేదు,” అని సీఐఏ అధికారులు చెబుతున్నారు.
మొజ్తాబా టెలిగ్రామ్ ఛానెల్ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒక రాతపూర్వక సందేశాన్ని, తన కొన్ని ఫోటోలతో పాటు ప్రచురించిన తర్వాత, ఆ ఫోటోలు ఇటీవలివా కాదా అని సీఐఏ తెలుసుకోవడానికి గూఢచార సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ నౌరూజ్ సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
తాజావార్తలు
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
-
Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో