Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీపై మొసాద్, సీఐఏ గురి..
- మొజ్తబా ఖమేనీపై మొసాద్, సీఐఏ గురి..
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎక్కడ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mojtaba Khamenei: ఇజ్రాయిల్, అమెరికా దాడి చేసిన తొలి రోజే ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేశాయి. అయితే, ఇప్పుడు కొత్తగా ఇరాన్ అత్యున్నత నేతగా ఎన్నికైన అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ కొసం ఇజ్రాయిల్, అమెరికా గూఢచార సంస్థలు మొసాద్, సీఐఏలు ఇరాన్ వ్యాప్తంగా వెతుకున్నాయి. ఈ దాడుల్లో మొజ్తబా ఖమేనీ భార్య, కుమారుడు కూడా మరణించారు. అయితే, మార్చి 09న కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికైనప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. ఒకటి రెండు సార్లు ఆయన ప్రకటనల్ని ఇరాన్ స్టేట్ మీడియా చదివింది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు సీఐఏ, మొసాద్ సంస్థలు ఇప్పుడు మొజ్తబా గురించి వెతుకుతున్నాయి. ముఖ్యంగా తన తండ్రి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పర్షియన్ నూతన సంవత్సరం ‘‘నౌరూజ్’’ సమయంలో దేశ ప్రజలకు సందేశం ఇస్తాడని అంతా ఎదురుచూశారు. అయితే, ఆయన కేవలం లిఖితపూర్వక ప్రకటన మాత్రమే చేశారు. దీంతో మొజ్తబా ఆరోగ్యం, అతడి అదృశ్యం గురించి మిస్టరీ తీవ్రమవుతోంది.
Also Read
- China: "మనం శత్రువులం కాము".. భారత్కు చైనా సందేశం..
- Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
- Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
- Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
ఆక్సియోస్ నివేదిక ప్రకారం.. ఇరాన్ అధికారులు అతనితో సమావేశాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం వంటి ఆధారాలను బట్టి చూస్తే, మొజ్తబా ఇంకా సజీవంగా ఉన్నాడని అమెరికా, ఇజ్రాయిల్ గూఢచార సంస్థల వద్ద సమాచారం ఉందని తెలుస్తోంది. ఇది అత్యంత విచిత్రంగా ఉంది. ఒక మరణించిన వ్యక్తిని సుప్రీం లీడర్గా ఎన్నుకోవడానికి ఇరాన్ వారు ఇంత శ్రమపడి ఉంటారని మేము అనుకోవడం లేదు; కానీ అదే సమయంలో, అతను నిజంగా నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తున్నాడనడానికి కూడా మా వద్ద ఎటువంటి రుజువు లేదు,” అని సీఐఏ అధికారులు చెబుతున్నారు.
మొజ్తాబా టెలిగ్రామ్ ఛానెల్ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒక రాతపూర్వక సందేశాన్ని, తన కొన్ని ఫోటోలతో పాటు ప్రచురించిన తర్వాత, ఆ ఫోటోలు ఇటీవలివా కాదా అని సీఐఏ తెలుసుకోవడానికి గూఢచార సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ నౌరూజ్ సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
తాజావార్తలు
-
Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
-
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
-
HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!