Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యవర్తిగా పాకిస్తాన్.. ఇస్లామాబాద్లో చర్చలు..!
- ఇరాన్-అమెరికా మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం..?
- ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగే ఛాన్స్..
Iran War: మిడిల్ ఈస్ట్ యుద్ధం మూడో వారానికి చేరింది. ఇప్పటికీ ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ లోని సౌదీ అరేబియా, కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈలపై దాడులు చేస్తూనే ఉంది. ఇక చమురు సరఫరాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ తన కంట్రోల్కి తీసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది.
ఇదిలా ఉంటే, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసేందుకు ముందుకు వచ్చింది. యుద్ధం తీవ్రం అవుతున్న వేళ తాను మధ్యవర్తిగా వ్యవహరించేందుకు దాయాది దేశం ప్రయత్నిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఇరాన్తో పాటు అటు అమెరికాతో పాకిస్తాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక గల్ఫ్ దేశమైన సౌదీతో ప్రత్యేకంగా రక్షణ ఒప్పందం కూడా పాకిస్తాన్ చేసుకుంది. ఈ మూడు కారణాల వల్ల పాకిస్తాన్ ‘మీడియేటర్’గా వ్యవహరించాలని అనుకుంటోంది.
Also Read
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
వస్తున్న రిపోర్టుల ప్రకారం, అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య ఈ వారంలోనే చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు ఉండే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడినట్లు సమాచారం. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ విషయమై చర్చలు జరిపారు.
ట్రంప్ చర్చలకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఒక ప్రకటనలో ఇరాన్తో చర్చలు జరుగుతున్నట్లు, త్వరలోనే ఒక డీల్ కుదురుతుందని ట్రంప్ అన్నారు. అయితే, ఇరాన్ వీటన్నింటిని ఖండించింది. ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేసింది. అయితే, కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్నాయని ఇరాన్ అంగీకరిచింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.
ఇరాన్ తర్వాత, పాకిస్తాన్లోనే అతిపెద్ద షియా ముస్లిం జనాభా ఉంది. గల్ఫ్ దేశాలతో బలమైన సంబంధాలు ఉండటం పాకిస్తాన్కు లాభిస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో అసిం మునీర్, షరీఫ్లో ట్రంప్ను వైట్హౌజ్లో కలిశారు. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ మధ్యవర్తిత్వంలో పాక్ విజయవంతమైతే ప్రాంతీయ శాంతికి దోహదం చేయడంతో పాటు, అంతర్జాతీయం దాని ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రస్తుతం, పాక్లో ఉన్న సమస్యల్ని కొంతకాలం పాటు పక్కదారి పట్టించే అవకాశం కూడా అక్కడి సైన్యం, పాలకులకు దొరుకుతుంది.
తాజావార్తలు
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!