Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యవర్తిగా పాకిస్తాన్.. ఇస్లామాబాద్లో చర్చలు..!
- ఇరాన్-అమెరికా మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం..?
- ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: మిడిల్ ఈస్ట్ యుద్ధం మూడో వారానికి చేరింది. ఇప్పటికీ ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ లోని సౌదీ అరేబియా, కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈలపై దాడులు చేస్తూనే ఉంది. ఇక చమురు సరఫరాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ తన కంట్రోల్కి తీసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది.
ఇదిలా ఉంటే, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసేందుకు ముందుకు వచ్చింది. యుద్ధం తీవ్రం అవుతున్న వేళ తాను మధ్యవర్తిగా వ్యవహరించేందుకు దాయాది దేశం ప్రయత్నిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఇరాన్తో పాటు అటు అమెరికాతో పాకిస్తాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక గల్ఫ్ దేశమైన సౌదీతో ప్రత్యేకంగా రక్షణ ఒప్పందం కూడా పాకిస్తాన్ చేసుకుంది. ఈ మూడు కారణాల వల్ల పాకిస్తాన్ ‘మీడియేటర్’గా వ్యవహరించాలని అనుకుంటోంది.
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
వస్తున్న రిపోర్టుల ప్రకారం, అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య ఈ వారంలోనే చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు ఉండే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడినట్లు సమాచారం. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ విషయమై చర్చలు జరిపారు.
ట్రంప్ చర్చలకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఒక ప్రకటనలో ఇరాన్తో చర్చలు జరుగుతున్నట్లు, త్వరలోనే ఒక డీల్ కుదురుతుందని ట్రంప్ అన్నారు. అయితే, ఇరాన్ వీటన్నింటిని ఖండించింది. ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేసింది. అయితే, కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్నాయని ఇరాన్ అంగీకరిచింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.
ఇరాన్ తర్వాత, పాకిస్తాన్లోనే అతిపెద్ద షియా ముస్లిం జనాభా ఉంది. గల్ఫ్ దేశాలతో బలమైన సంబంధాలు ఉండటం పాకిస్తాన్కు లాభిస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో అసిం మునీర్, షరీఫ్లో ట్రంప్ను వైట్హౌజ్లో కలిశారు. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ మధ్యవర్తిత్వంలో పాక్ విజయవంతమైతే ప్రాంతీయ శాంతికి దోహదం చేయడంతో పాటు, అంతర్జాతీయం దాని ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రస్తుతం, పాక్లో ఉన్న సమస్యల్ని కొంతకాలం పాటు పక్కదారి పట్టించే అవకాశం కూడా అక్కడి సైన్యం, పాలకులకు దొరుకుతుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!