Strait of Hormuz: హర్మూజ్లో ఎక్కడికక్కడే నిలిచిపోయిన వందలాది షిప్స్.. ఏరియల్ ఫోటోలు వైరల్
- హర్మూజ్లో ఎక్కడికక్కడే నిలిచిపోయిన వందలాది షిప్స్
- మార్చి నెలలో కేవలం 100 ఓడలు మాత్రమే ఈ జలసంధి గుండా వెళ్లగలిగాయి
- అంచనాల ప్రకారం 300 నుంచి 400 వరకు నిలిచిపోయాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఓడల మార్గమైన హార్ముజ్ జలసంధి వద్ద ప్రస్తుతం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విమానం నుంచి తీసిన ఏరియల్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సముద్రంలో చిన్న చిన్న బొమ్మల్లా వందలాది షిప్స్ ఎక్కడికక్కడే ఆగిపోయి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని దాదాపుగా బ్లాకేడ్ చేసింది. ఫలితంగా మార్చి నెలలో కేవలం 100 ఓడలు మాత్రమే ఈ జలసంధి గుండా వెళ్లగలిగాయి. సాధారణంగా రోజుకు 100 నుంచి 140 ఓడలు వెళ్తాయి, కానీ ఇప్పుడు ట్రాఫిక్ దాదాపు సున్నాకి దిగిపోయింది. పర్షియన్ గల్ఫ్ (పర్ష్యా సముద్రం) లోపల, బయట వందలాది ఓడలు (కొన్ని అంచనాల ప్రకారం 300 నుంచి 400 వరకు) నిలిచిపోయాయి.
Also Read:BCCI-IPL 2026: తొలి మ్యాచ్కు ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఈ సీజన్లో కీలక మార్పు..
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
ఈ జలసంధి ద్వారా ప్రపంచంలోని 20% ఆయిల్, 20% ఎల్ఎన్జీ (LNG) రవాణా జరుగుతుంది. ఇది మూసుకుపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగాయి. ఎనర్జీ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. ప్యాసెంజర్ విమానం విండో నుంచి తీసిన ఫుటేజ్లో సముద్రం మొత్తం ఓడలతో నిండి ఉన్నట్లు కనిపిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ కూడా రెండు వైపులా ఓడల క్లస్టర్లను స్పష్టంగా చూపిస్తున్నాయి.
Also Read:Amaravati Fire Accidents: అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఈ సమస్య వల్ల సుమారు 40,000 మంది సీఫారర్లు (నావికులు) ఓడలపై చిక్కుకుపోయారు. చాలా మంది ఇంటికి తిరిగి రావాలనుకున్నా, యుద్ధ ప్రాంతంలో క్రూ మార్పిడి చేయడం కష్టంగా మారింది. హార్ముజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైన చోక్ పాయింట్. ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోతే ఆయిల్ ధరలు పెరుగుతాయి. గ్లోబల్ షిప్పింగ్ ఖర్చులు పెరుగుతాయి. ఇంధన సరఫరా సమస్యలు ఏర్పడతాయి.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం