Strait of Hormuz: హర్మూజ్లో ఎక్కడికక్కడే నిలిచిపోయిన వందలాది షిప్స్.. ఏరియల్ ఫోటోలు వైరల్
- హర్మూజ్లో ఎక్కడికక్కడే నిలిచిపోయిన వందలాది షిప్స్
- మార్చి నెలలో కేవలం 100 ఓడలు మాత్రమే ఈ జలసంధి గుండా వెళ్లగలిగాయి
- అంచనాల ప్రకారం 300 నుంచి 400 వరకు నిలిచిపోయాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఓడల మార్గమైన హార్ముజ్ జలసంధి వద్ద ప్రస్తుతం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విమానం నుంచి తీసిన ఏరియల్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సముద్రంలో చిన్న చిన్న బొమ్మల్లా వందలాది షిప్స్ ఎక్కడికక్కడే ఆగిపోయి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని దాదాపుగా బ్లాకేడ్ చేసింది. ఫలితంగా మార్చి నెలలో కేవలం 100 ఓడలు మాత్రమే ఈ జలసంధి గుండా వెళ్లగలిగాయి. సాధారణంగా రోజుకు 100 నుంచి 140 ఓడలు వెళ్తాయి, కానీ ఇప్పుడు ట్రాఫిక్ దాదాపు సున్నాకి దిగిపోయింది. పర్షియన్ గల్ఫ్ (పర్ష్యా సముద్రం) లోపల, బయట వందలాది ఓడలు (కొన్ని అంచనాల ప్రకారం 300 నుంచి 400 వరకు) నిలిచిపోయాయి.
Also Read:BCCI-IPL 2026: తొలి మ్యాచ్కు ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఈ సీజన్లో కీలక మార్పు..
Also Read
- Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
- Pakistan: టెంపోలో శవపేటికలు.. పాకిస్తాన్ పోలీసుల దుస్థితిపై తీవ్ర విమర్శలు
- Maruti Suzuki July 2026 Offers: గుడ్న్యూస్.. మారుతి సుజుకి కార్లపై రూ. 2.10 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు!
- Sourav Ganguly: ‘దాదా’కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఐసీసీ.. గంగూలీ భావోద్వేగ పోస్ట్..
ఈ జలసంధి ద్వారా ప్రపంచంలోని 20% ఆయిల్, 20% ఎల్ఎన్జీ (LNG) రవాణా జరుగుతుంది. ఇది మూసుకుపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగాయి. ఎనర్జీ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. ప్యాసెంజర్ విమానం విండో నుంచి తీసిన ఫుటేజ్లో సముద్రం మొత్తం ఓడలతో నిండి ఉన్నట్లు కనిపిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ కూడా రెండు వైపులా ఓడల క్లస్టర్లను స్పష్టంగా చూపిస్తున్నాయి.
Also Read:Amaravati Fire Accidents: అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఈ సమస్య వల్ల సుమారు 40,000 మంది సీఫారర్లు (నావికులు) ఓడలపై చిక్కుకుపోయారు. చాలా మంది ఇంటికి తిరిగి రావాలనుకున్నా, యుద్ధ ప్రాంతంలో క్రూ మార్పిడి చేయడం కష్టంగా మారింది. హార్ముజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైన చోక్ పాయింట్. ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోతే ఆయిల్ ధరలు పెరుగుతాయి. గ్లోబల్ షిప్పింగ్ ఖర్చులు పెరుగుతాయి. ఇంధన సరఫరా సమస్యలు ఏర్పడతాయి.
తాజావార్తలు
-
Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
-
Pakistan: టెంపోలో శవపేటికలు.. పాకిస్తాన్ పోలీసుల దుస్థితిపై తీవ్ర విమర్శలు
-
Maruti Suzuki July 2026 Offers: గుడ్న్యూస్.. మారుతి సుజుకి కార్లపై రూ. 2.10 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు!
-
Sourav Ganguly: ‘దాదా’కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఐసీసీ.. గంగూలీ భావోద్వేగ పోస్ట్..
-
Kotha Cinema: బొగ్గుబావి నుంచి టాలీవుడ్కి వంద మంది
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..