అయతుల్లా అలీ ఖమేనీ. ఇరాన్ సుప్రీం లీడర్. అత్యున్నతమైన హోదాలో ఉన్న నాయకుడు. ప్రపంచంలో గుర్తింపు ఉన్న నేత. అలాంటి నాయకుడిని ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా అంతమొందించాయి. ఈ ఘటన ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది.
మధ్యప్రాచ్య యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్ కుదేల్ అయిపోతుంది. ఈ వారం మార్కెట్ ప్రారంభం నుంచి భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత చేజారిపోతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. గత ఏడు రోజులుగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గత డిసెంబర్ 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి.
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తుండగా.. ఇంకోవైపు ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇంకోవైపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు చమురు సమస్య తలెత్తింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర అవుతున్నాయి. తగ్గుముఖం పడతాయనుకుంటే రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు మరింత సీరియస్గా మారాయి.
గత ఐదు రోజులుగా భీకర యుద్ధంతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తుండగా.. ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది.
Gravity Bomb: ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా ‘‘గ్రావిటీ బాంబు’’ ప్రయోగిస్తామని హెచ్చరిస్తోంది. ఇటీవల యూఎస్ రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్సేత్ మాట్లాడుతూ.. "అమెరికా సైనిక చర్య ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయి. ఈ మిషన్ కోసం అమెరికా తన అపరిమిత నిల్వ అయిన ప్రెసిషన్ గ్రావిటీ బాంబులను ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది" అని అన్నారు.
Iran War: ఇరాన్పై దాడి చేయడానికి భారత్ ఓడరేవుల్ని అమెరికా వాడుకుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది, ఇలాంటి ఊహాగానాలను భారత్ తిరస్కరించింది. అమెరికాకు చెందిన వన్ అమెరికా న్యూస్ నెట్వర్క్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ యుఎస్ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్గ్రెగర్, ఇరాన్పై తన యుద్ధంలో అమెరికా భారత నావికా స్థావరాలను ఉపయోగించుకుంటోందని అన్నారు.
Iran Attack on Saudi: ఇరాన్ తన దాడుల్ని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా కువైట్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలపై ప్రతీకారంతో విరుచుకుపడుతోంది. తాజాగా చమురు దిగ్గజ సంస్థ సౌదీ అరామ్కోకు చెందిర రాస్ తనురా రిఫైనరీపై దాడి చేసింది. ఈ రోజు మళ్లీ రిఫైనరీ దాడికి గురైనట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ అరామ్కో కాంప్లెక్స్ అతిపెద్ద దేశీయ చమురు శుద్ధి కార్మాగారాలకు నిలయంగా ఉంది. ఇది ఆ దేశ ఇంధన…
Submarine attack: శ్రీలంక దక్షిణ తీరంలో ఇరానియన్ నౌకపై జలాంతర్గామి దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో కనీసం 101 మంది గల్లంతయ్యారని, 78 మంది గాయపడినట్లు శ్రీలంక నేవీ, రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలియజేసింది. శ్రీలంక జలాల్లో ఈ సంఘటన జరిగింది. ప్రమాదానికి గురైన నౌక నుంచి ప్రమాద హెచ్చరికలు రావడంతో శ్రీలంకన్ సైన్యం పెద్ద ఎత్తున సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. చాలా మంది తప్పిపోయినట్లు, గాయాలపాలైనట్లు శ్రీలంక సైన్యం…