జూలై నెలలో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అందుకోసం బీసీసీఐ టీమ్ను కూడా ప్రకటించింది. జింబాబ్వేతో మొత్తం ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. జూలై 6 నుండి జూలై 14 వరకు మ్యాచ్ లు జరుగనున్నాయి. అందుకోసం టీమిండియా బయల్దేరి వెళ్లింది. అయితే.. ఇంతకుముందు ప్రకటించిన టీమిండియా జట్టులో స్వల్ప మార్పులు చేసింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం కల్పించింది బీసీసీఐ. ఈ టూర్ లో సంజూ…
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ గురించి గానీ.. అతని రికార్డుల గురించి గానీ తెలియని వారు ఎవరుండరు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ ఎన్నో రికార్డులు సాధించాడు. అయితే.. ఇన్ని రికార్డులు, ప్రశంసలు అందుకున్నప్పటికీ రెండు సందర్భాల్లో తన హృదయం బద్దలైందని చెప్పారు. ఇటీవల జియో సినిమా ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్ కోహ్లీ.. 2016లో జరిగిన ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో తన హార్ట్ బ్రేక్ అయిందని చెప్పుకొచ్చారు.…
ఈసారి ఐపీఎల్లో ఆర్సీబీ టైటిల్ సాధిస్తుందనే గట్టి నమ్మకం క్రికెట్ అభిమానుల్లో ఉండేది. కానీ.. ఈసారి కూడా టైటిల్ గెలువలేకపోతుంది. సీజన్ ప్రారంభంలో అన్నీ మ్యాచ్ ల్లో ఓడిపోయి.. చివర్లో గెలుస్తూ వస్తున్నారు. కానీ.. ఆర్సీబీకి ప్లేఆఫ్స్ చేరడం కష్టమే. ఈ క్రమంలో.. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆర్సీబీకి సలహా ఇచ్చారు. భవిష్యత్తులో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే.. భారత ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. 17 ఏళ్ల నుంచి వేచి చూస్తున్న ఆర్సీబీ…
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పేసర్ మయాంక్ యాదవ్ గాయం తిరగబడినట్లు సమాచారం. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆయన 3.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆయన కోటాను నవీన్ ఉల్ హక్ పూర్తి చేశారు. మయాంక్ పూర్తిగా కోలుకోకుండానే ముంబైతో మ్యా్చ్లో ఆడించినట్లు క్రీడా నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే గాయం తిరగబెట్టిందని భావిస్తున్నారు.
దేశవాళీ క్రికెటర్ల జీవితాలు బాగుపడనున్నాయి. రాబోయే సీజన్ నుండి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు రెట్టింపు కాబోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ క్రికెట్ బోర్డుగా బీసీసీఐ కొనసాగుతుంది. ఇకపోతే అంతర్జాతీయ క్రికెటర్లు, ఐపీఎల్ కాంట్రాక్టర్ పొందిన ఆటగాళ్లు కోట్లలో సంపాదిస్తుంటే మరోవైపు ఒళ్ళు హూనం చేసిన దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లాడే క్రికెటర్లకు మాత్రం లక్షల రూపాయలలో మాత్రమే సరిపెట్టింది బీసీసీఐ. కాకపోతే ఇప్పుడు ఈ విషయాన్నీ పూర్తిగా సరిదిద్దాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. Also Read: Viral…
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా పంజాబ్-గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ ముగిసే సరికి పంజాబ్ 10 వికెట్ల నష్టానికి142 రన్లు చేసింది. గుజరాత్ ముందు స్వల్ప లక్ష్యం ఉంచింది. గుజరాత్ బౌలర్లు పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశారు.
నేడు ఐపీఎల్ లో రెండో మ్యాచ్ పంజాప్- గుజరాత్ మధ్య జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు టీంల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో పంజాబ్ గెలుపొందింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ దావన్ ఆడటం లేదు. తన భుజానికి అయిన గాయం కారణంగా ఆయన ఈ మ్యాచ్ ఆడటం లేదు.
ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై కేకేఆర్ విజయం సాధించింది. 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఒక్క రన్ తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింకు దిగిన కోహ్లీ 18 రన్లు చేసి.. హర్షిత్ రాణా చేతిలో ఔటయ్యాడు.
ఈడెన్ గార్డెన్సలో జరుగుతున్న మ్యాచ్లో కోల్ కతా 222 పరుగులు చేసింది. బెంగళూరు ఈ మ్యాచ్ గెలవాలంటే 223 రన్లు సాధించాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు ప్రతిభ కనబరిచారు. గత ఏడు మ్యాచులలో సరైన బౌలింగ్ లేక వరుస ఓటముల పాలైన బెంగళూరు టీంకి కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్లో బౌలర్లు చేయూత నందించారు.
చెలరేగుతున్న బెంగళూరు బౌలర్లు. బోలింగ్ సరిగ్గా లేకపోవడంతో బెంగళూరు వరుసగా ఓటముల పాలవుతోంది. స్టార్ బౌలర్గా పేరు తెచ్చుకున్న సిరాజ్ తన పేరును నిలబెట్టుకోలేక పోయాడు. కాని కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ ఈ సీజన్లో మొట్టమొదట అయిదు వికెట్లు తీసుకుంది.