రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్-2022 మెగావేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 204 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 67 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 204 మంది ఆటగాళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.551.7 కోట్లను ఖర్చు చేశాయి. ఈ ఐపీఎల్ వేలంలో ఇషాన్ కిషన్ అత్యధిక ధర పలికాడు. అతడి కోసం ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్లను ఖర్చు చేసింది. రెండో స్థానంలో దీపక్ చాహర్ నిలిచాడు. అతడిని చెన్నై సూపర్కింగ్స్…
టీమిండియా ఆల్రౌండర్ శివం దూబే ఆదివారం నాడు రెండు గుడ్ న్యూస్లు అందుకున్నాడు. అతడు ఆదివారం తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ముంబై వాసి శివం దూబే గత ఏడాది గర్ల్ఫ్రెండ్ అంజుమ్ఖాన్ను వివాహం చేసుకున్నాడు. ఆదివారం అంజుమ్ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో శివం దూబే తన భార్య, కొడుకు ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. మరోవైపు ఐపీఎల్ మెగా వేలంలో శివం దూబేను రూ.4 కోట్లకు చెన్నై సూపర్కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. ఇలా ఒకేరోజు రెండు…
టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను తొలుత ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. దీంతో అతడు మళ్లీ రెండోసారి వేలానికి వచ్చాడు. రెండోసారి మాత్రం అతడిని ఈ ఏడాది ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్న కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్ సాహాను రూ.1.9 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మను రూ.1.7 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. వేలంలో అమ్ముడుపోయిన ఇతర ఆటగాళ్ల వివరాలు:★ ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ను రూ.8…
బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో క్రికెటర్లపై ఫ్రాంఛైజీలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. వేలంలో శనివారం నాడు ఏకంగా 10 మంది ఆటగాళ్లు రూ.10 కోట్లుపైన ధర పలికారు. ఆదివారం కూడా ఆటగాళ్ల వేలం జోరుగా సాగుతోంది. ఈ మేరకు తెలుగు ప్లేయర్ ఐపీఎల్ మెగా వేలంలో ఎంపికయ్యాడు. నెల్లూరు జిల్లాకు చెందిన అశ్విన్ హెబ్బార్ను నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అశ్విన్ హెబ్బార్ 2015 నుంచి రంజీల్లో…
ఇటీవల వెస్టిండీస్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ను గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఐపీఎల్ మెగా వేలంలో జాక్పాట్ తగిలింది. అండర్-19 టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు దక్కించుకుంది. అటు ఆల్రౌండర్ రాజ్ బవాను పంజాబ్ కింగ్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. రాజ్ బవా మీడియం పేస్ బౌలింగ్ వేయగలడు. అంతేకాకుండా మిడిల్ ఓవర్లలో పరిస్థితులకు అనుకూలంగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అందుకే పంజాబ్ కింగ్స్ అతడిని రూ.2 కోట్లకు దక్కించుకుంది. అండర్-19…
బెంగళూరులో ఐపీఎల్ వేలం కొనసాగుతోంది. రెండోరోజు వేలంలో ఇప్పటివరకు చూసుకుంటే.. ఇంగ్లండ్కు చెందిన ఆల్ రౌండర్ లివింగ్స్టోన్ అత్యధిక ధర పలికాడు. లివింగ్ స్టోన్ కనీస ధర రూ.కోటి కాగా… పంజాబ్ కింగ్స్ జట్టు ఏకంగా అతడిని రూ.11.5 కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసింది. లివింగ్ స్టోన్ హిట్టర్ కావడంతో అతడిని దక్కించుకునేందుకు పంజాబ్ కింగ్స్ జట్టు పోటీ పడింది. అతడు బంతితోనేగాక బ్యాట్తోనూ ఆటను మలుపు తిప్పగలడు. బంతితో సమర్థంగా ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్…
ఐపీఎల్ వేలంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేలం పాట పాడుతున్న హ్యూజ్ ఎడ్మీడ్స్ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. ఈ ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు వేలాన్ని ఆపేశారు. అయితే అతడికి ఏమైందనే విషయం ఇంకా తెలియరాలేదు. అప్పటికి శ్రీలంక ఆల్రౌండర్ హసరంగా రూ.10.75 కోట్లతో వేలంలో ఉన్నాడు. ఈ ఘటనతో ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న వివిధ ఫ్రాంచైజీలకు చెందిన వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా టీవీ ఛానళ్లలో లైవ్ ప్రసారం కూడా ఆపేశారు.
బెంగళూరు వేదికగా ఐపీఎల్-2022 మెగా వేలం జరుగుతోంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు రూ.560 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ★ శిఖర్ ధావన్ను రూ.8.25 కోట్లకు వేలంలో దక్కించుకున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్★ రవిచంద్రన్ అశ్విన్ను రూ.5 కోట్లకు వేలంలో దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్★ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ను రూ.7.25…
త్వరలో జరగనున్న ఐపీఎల్-2022 వేలం బరిలో తూర్పు గోదావరి జిల్లా రాజోలు కుర్రాడు 29 ఏళ్ల బండారు అయ్యప్ప అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మీడియం పేస్ బౌలర్గా, రైట్ హ్యాండ్ బ్యాటర్గా అయ్యప్ప రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2019 లీగ్లో అయ్యప్పను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే తుది జట్టులోకి మాత్రం తీసుకోలేదు. Read Also: ఇండియాలో ఐపీఎల్ నిర్వహించడంపై గంగూలీ…
ఐపీఎల్ 2022 వేలానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా వేలానికి కర్ణాటక రాజధాని బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియను బీసీసీఐ నిర్వహించనుంది. కర్ణాటక ప్రభుత్వం కోవిడ్-19 పరిమితులను ఎత్తివేసిన నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ కోసం హోటల్ బుకింగ్ ప్రక్రియను బీసీసీఐ ప్రారంభించింది. తాజాగా ఐపీఎల్ పాలకమండలి వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. Read Also: స్వదేశంలో భారత్ను ఓడించే…