అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్పై 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్లో ఆఖరి ఓవర్ వరకు విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. యశస్వి జైస్వాల్ అర్థ సెంచరీతో శుభారంభం ఇవ్వగా,…
వైభవ్ సూర్యవంశీ... ఐపీఎల్ చరిత్రలో ఈ పేరు మరో పదేళ్లు గుర్తుండి పోతుంది. పద్నాలుగేళ్ల ప్రాయంలో ఐపీఎల్లో అడుగుపెట్టి 35 బంతుల్లో సెంచరీ బాది ప్రపంచ క్రికెట్నే ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా.. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యా్న్ని 23 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్నో 193 పరుగులు చేసి గెలుపొందింది.
LSGvsDC : ఐపీఎల్ 2025 టోర్నీ భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ను ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టంతో 209 పరుగులు సాధించింది. లక్నో జట్టు నుండి మిచెల్ మార్ష్ (72) , నికోలస్ పూరన్ (75) అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఢిల్లీ బౌలర్లపై…
విశాఖపట్టణం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 209 పరుగుల భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 210 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది.
క్రికెట్ ప్రియులను అలరించేందుకు వైజాగ్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ప్రారంభంకాబోతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా ఏసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. వైజాగ్ క్రికెట్ స్టేడియంలో 30 మంది అనాథ చిన్నారులకు ఐపీఎల్ మ్యాచ్ చూసే అవకాశం కల్పించింది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్. ఏసీఏ తన సొంత నిధులతో 30 టికెట్స్ కొని వైజాగ్…
బాలీవుడ్ నటుడు షారూఖ్ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం అహ్మదాబాద్లో డీహైడ్రేషన్కు గురి కావడంతో కేడీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో షారూఖ్ఖాన్ను వైద్యులు పరీక్షించాక డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది
మే 12న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు.. పాడైపోయిన ఆహారం తిన్నామంటూ ఆరోపించారు. దీంతో.. బాధితుల ఫిర్యాదు మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్మెంట్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో కేఎస్సీఏ మేనేజ్మెంట్, క్యాంటీన్ మేనేజర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
బాలయ్య ముక్కు సూటి మనిషి.. మనసులో ఎదనిపిస్తే అది చెప్పేస్తారు.. ఆయన సినిమాల్లో ఎంత గంభీరంగా ఉంటారో.. బయట అంత సరదాగా ఉంటారు.. జోకులు వేస్తారు.. తాజాగా స్టార్ క్రికెటర్స్ గురించి అదిరిపోయే డైలాగులు చెప్పారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వచ్చే నెల 22 నుంచి ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.…