Traffic Restriction: నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. సాయంత్రం 4 నుంచి రాత్రి 11.50 వరకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Restriction: నేడు నగరంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.50 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేడు సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం ఆవరణలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు.
సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. బోడుప్పల్, చెంగిచర్ల, ఉప్పల్ వైపు నుంచి భాగయత్ లే అవుట్ నుంచి నాగోల్ వైపు వచ్చే వాహనాలు, హెచ్ఎండీఏ లేఔట్ నుంచి బోడుప్పల్, చెంగిచర్ల ఎక్స్ రోడ్డు వైపు ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు. తార్నాక వైపు నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు తార్నాక వైపు నుంచి రాక, బయలు దేరి వెళ్లాలని సూచించారు.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
Read also: Secunderabad Railway Station: అద్భుతం.. గాలి నుంచే నీటి తయారీ.. లీటర్ నీరు ఎంతంటే?
మరోవైపు ఉప్పల్ స్టేడియంలో నేడు రాయల్ ఛాలెంజర్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగించారు. ఈరోజు మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి పరుగులు తీస్తున్నాయి. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు మధ్యాహ్నం 12:15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని మెట్రో అధికారులు వెల్లడించారు.
ఐపీఎల్ మ్యాచ్ను తిలకించేందుకు వస్తున్న క్రికెట్ అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నేడు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం వరకు 60 అదనపు బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ బస్సులు అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు.
Jagga Reddy: పార్టీలో చేరే వాళ్లు నేడు, రేపు గాంధీ భవన్ కు రావచ్చు.. జగ్గారెడ్డి సూచన
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. సెలెక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!