SRH vs LSG: ఎస్ఆర్హెచ్ను చెడుగుడు ఆడుకున్న లక్నో..
- సన్రైజర్స్ హైదరాబాద్పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
- 5 వికెట్ల తేడాతో గెలుపు
- 23 బంతులు మిగిలి ఉండగానే లక్నో విక్టరీ
- 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసిన లక్నో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో భాగంగా.. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యాన్ని 23 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్నో 193 పరుగులు చేసి గెలుపొందింది. గతేడాది ప్రతీకారాన్ని ఈ మ్యాచ్లో తీర్చుకుంది లక్నో జట్టు. మరోవైపు.. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ బౌలర్లను పూరన్ ఓ ఆట ఆడుకున్నాడు. కేవలం 26 బంతుల్లోనే 70 పరుగులు సాధించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని ఇన్నింగ్స్లో 6 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. మరో బ్యాటర్ మిచెల్ మార్ష్ కూడా చెలరేగాడు. 31 బంతుల్లో 2 సిక్సులు, 7 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ (15), అబ్దుల్ సమద్ (22), డేవిడ్ మిల్లర్ (13) పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలింగ్లో కమిన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. షమీ, జంపా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.
Read also: Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు అనుకున్నంత పరుగుల రాణించలేకపోయారు. మొదటి మ్యాచ్తో పోల్చితే ఈ స్కోరు చాలా తక్కువ. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ పై ఆశలు పెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ.. ఈ మ్యాచ్లో నిరాశపరిచారు. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్ (47), నితీష్ కుమార్ రెడ్డి (32), అనికేత్ వర్మ (36), క్లాసెన్ (26), కమిన్స్ (18), హర్షల్ పటేల్ (11) పరుగులు చేశారు. మరోవైపు.. లక్నో జట్టు అద్భుత బౌలింగ్ చేసింది. శార్దుల్ ఠాకూర్ కీలకమైన 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అవేశ్ ఖాన్, దిగ్వేష్ రాఠి, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!