చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో విమానం సురక్షితంగా ముంబైలో ల్యాండ్ అయింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించేసినట్లు ఇండిగో తన ప్రకటనలో తెలిపింది.
ఇటీవల కాలంలో విమానాల్లో, విమనాశ్రయాల్లో ఆకతాయిలు బాంబులు పెట్టామని బెదిరింపు కాల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరిస్తున్నారు. మరోవైపు.. ఇప్పటికి వచ్చిన బెదిరింపు కాల్స్ అన్నీ ఫేక్ అని అధికారులు నిర్థారించారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో.. చెన్నై నుండి ముంబైకి వెళ్తున్న ఇండిగో 6E 5314 విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లే ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ ద్వారా ఖాళీ చేయించిన సిబ్బంది.
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో 30 వైడ్ బాడీ A350-900 విమానాలను ఆర్డర్ చేసింది. అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరిస్తున్న ఎయిర్లైన్స్ గురువారం ఈ ప్రకటన చేసింది. కంపెనీ ప్రస్తుతం నారో బాడీ ఎయిర్బస్ విమానాలను మాత్రమే నడుపుతోంది. అయితే.. ఇస్తాంబుల్ మార్గంలో కార్యకలాపాల కోసం టర్కిష్ ఎయిర్లైన్స్ నుండి రెండు బోయింగ్ 777 విమానాలను కంపెనీ లీజుకు తీసుకుంది.
Kolkata : ఇండిగో విమానం ల్యాండ్ అయ్యే ముందు పైలట్ కళ్లకు లేజర్ కిరణాలు తగిలిన విషయం వెలుగులోకి వచ్చింది. కోల్కతా విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్కు కిలోమీటరు దూరంలో ఉండగా ఈ ఘటన జరిగింది.
ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు విమానం ఆలస్యానికి సంబంధించి ప్రకటన చేస్తుండగా పైలట్పై దాడి చేశాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
IndiGo Flight: ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఏరోబ్రిడ్జిపై గంటల తరబడి నిలిచిపోయింది. దీంతో ముంబై విమానాశ్రయంలో గందరగోళ వాతావరణం నెలకొంది.
IndiGo Hikes Front Row Window Seat Price: ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ సీట్ల ఎంపిక ఛార్జీలను పెంచింది. ప్రయాణికులు తమ సీట్లను ఎంపిక చేసుకునేందుకు ఇకనుంచి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇండిగో విమానాల్లో ఎక్కువ లెగ్ రూమ్ ఉండే ముందు సీట్ల ఎంపిక కోసం ప్రయాణికులు దాదాపు రూ. 2000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వెనుక సీట్లకు సీటు ఎంపిక ధరను బేస్ ఛార్జీకి అదనంగా రూ. 75గా నిర్ణయించారు. నివేదికల…
Paayal Rajput Fires on Indigo for Continues Delays: ఒక్కో సారి విమాన ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఫ్లైట్స్ డిలే అవుతూ ఉంటాయి. ఇది ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసే వారందరికీ దాదాపుగా అనుభవం అవుతూనే ఉంటుంది. తాజాగా మాత్రం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి ఇలాంటి అనుభవం అవడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా తన ట్విట్టర్ సోషల్ మీడియా ఖాతా ద్వారా పాయల్ రాజ్ పుత్…
మీచౌంగ్ తుఫాన్ దెబ్బకి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు రద్దు చేశారు.. ఇండిగో నుంచి నడిచే 14 విమానాలు రద్దు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.. విశాఖ, హైదరాబాద్, బెంగులూరు, షిర్డీలకు కనెక్టింగ్ ఫ్లైట్స్ రద్దు చేసినట్టు పేర్కొంది ఇండిగో.. మరో 4 విమానాల రాకపోకలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.