Air Taxi: 2026 నాటికి అందుబాటులోకి ఎయిర్ ట్యాక్సీలు.. ఫస్ట్ ఏ నగరాల్లో అంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Taxi: త్వరలో భారతదేశంలో టాక్సీలు గాలిలో ఎగురుతున్నట్లు చూడొచ్చు. ఈ సేవను భారతదేశానికి తీసుకురావడానికి ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, ఆర్చర్ ఏవియేషన్ చేతులు కలిపాయి. 2026 నాటికి భారత్లో ఈ సర్వీసును ప్రారంభించాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి. భారతదేశంలో ఎయిర్ టాక్సీ సేవ వచ్చిన తర్వాత మీరు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుండి గుర్గావ్ వరకు కేవలం ఏడు నిమిషాల్లో ప్రయాణించగలరు. ప్రస్తుతం ఈ 27 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు 60 నుంచి 90 నిమిషాల సమయం పడుతోంది.
ఎంఓయూపై సంతకాలు
గురువారం ఇరు సంస్థల మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ కార్యక్రమంలో ఇంటర్గ్లోబ్ గ్రూప్ ఎండీ రాహుల్ భాటియా, ఆర్చర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ (సీసీఓ) నిఖిల్ గోయల్ పాల్గొన్నారు. ఇందులో ఎయిర్ ట్యాక్సీని ఇండియాలో తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రెండు కంపెనీలు ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరనున్నాయి.
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- 10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ఇండిగో ఎయిర్లైన్స్ ఇంటర్గ్లోబ్లో ఒక భాగం
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్లో భాగం. ఆర్చర్ ఎలక్ట్రిక్ వాహనాలు, విమానాలను అద్దెకు ఇచ్చే సంస్థ.
Read Also:TTD: హాట్ కేకుల్లా వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విక్రయం.. నిమిషాల వ్యవధిలోనే పూర్తి
ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ ఉపయోగించబడుతుంది?
మెట్రో నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలను అందించడమే కాకుండా కార్గో, లాజిస్టిక్స్, మెడికల్, ఎమర్జెన్సీ సర్వీసెస్లో కూడా ఈ ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్లను ఉపయోగించాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి. దీంతోపాటు ప్రైవేట్ సంస్థలు కూడా వీటిని అద్దెకు తీసుకోవచ్చు. పైలట్లు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, భారతదేశంలో ఈ సేవ కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కూడా పని చేయబడుతుంది.
నలుగురు ప్రయాణించే వీలు
ఈ సేవ కోసం 200 ఆర్చర్ మిడ్నైట్ విమానాలను కొనుగోలు చేస్తారు. ఈ విమానాల్లో నలుగురు ప్రయాణికులు కలిసి ప్రయాణించవచ్చు. ఈ విమానాలు తక్కువ తరచుగా ప్రయాణించేలా రూపొందించబడ్డాయి. అవి కూడా వేగంగా ఛార్జ్ అవుతాయి.
పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
రెండు దశాబ్దాలుగా తమ సంస్థ భారతీయ ప్రయాణీకులకు సురక్షితమైన, చౌక రవాణా ఎంపికలను అందించిందని రాహుల్ భాటియా చెప్పారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ను పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరోవైపు, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలోని అనేక నగరాలు తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నాయని నిఖిల్ గోయల్ చెప్పారు. ఎయిర్ టాక్సీ ద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తున్నాం.
Read Also:Marriages: ఏంట్రా బాబు.. ఆ ఊళ్లో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు..
తాజావార్తలు
-
Yash Toxic: యష్కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?