India Vs New Zealand: ఆకాశంలో విమానం.. లైవ్ స్కోర్ అప్డేట్స్ అందించిన ఇండిగో పైలెట్.. ట్వీట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Vs New Zealand: నిన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ క్రికెట్ లవర్స్కి మంచి అనుభూతిని ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ మెరుపు ఓపెనింగ్తో పాటు గిల్ సూపర్ ఇన్నింగ్స్ ఒకెత్తయితే, కింగ్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలోతో ఔరా అనిపించారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొడుతూ.. వన్డేల్లో 50వ సెంచరీ చేసి విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. బుధవారం జరిగిన ఈ మ్యాచుని దేశం మొత్తం టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోయారు.
ఇదిలా ఉంటే ఆకాశంలో ఉన్న విమానంలో ఏకంగా ఫ్లైట్ కెప్టెన్ క్రికెట్ లైవ్ స్కోర్ అందిస్తూ ప్రయాణికులను ఉత్సాహపరిచారు. ఈ ఘటన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. తమ పైలెట్ ప్రతీ 30 నిమిషాలకు ఒకసారి లైవ్ స్కోర్ అప్డేట్ చేయడంపై ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. బెంగళూర్కి చెందిన కమ్యూనికేషన్ ప్రొఫెషనల్ నీర్జా షా ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. ‘‘ మా ఇండిగో6ఈ ఫ్లైట్ కెప్టెన్ ల్యాండ్ అయ్యే వరకు ప్రతీ అరగంటకు ఒకసారి వరల్డ్ కప్ మ్యాచ్ అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. ఈ దేశం క్రికెట్ని ఎలా ఆరాధిస్తుందో తెలిసింది’’ అంటూ పోస్ట్ చేశారు.
Also Read
- KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
- MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
Read Also: Rohit Shama: శ్రేయాస్ని ఇమిటేట్ చేసిన రోహిత్.. వీడియో వైరల్
కెప్టెన్ ఇలా లైవ్ స్కోర్ అప్డేట్స్ అందించడంపై ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో 2019లో వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచు గురించి ఓ నెటిజన్ ముంబై-బెంగళూర్ ఇండిగో విమానంలో ఇలాంటి ఘటననే గుర్తుచేసుకున్నారు.
దీనిపై స్పందించిన ఇండిగో యాజమాన్యం..‘‘మా కెప్టెన్ మీ విమానాన్ని లైవ్ స్టోర్ట్స్ అప్డేట్గా మార్చారని వినడానికి మేము సంతోషిస్తున్నాము. ఇండిగోలో మా ప్రయాణికులు ఆకర్షణీయమైన, వినోదాత్మక అనుభవాన్ని అందించాడాన్ని మేం లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అంటూ ఎక్స్లో ట్వీట్ చేసింది.
నిన్న జరిగిన మ్యాచులో న్యూజిలాండ్పై ఇండియా 70 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అనేక రికార్డులకు ఈ మ్యాచ్ వేదికగా నిలిచింది. క్రికెట్ లెజెండ్ సచిన్తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్కి చెందిన పలువురు నటులు హాజరయ్యారు. ఈ మ్యాచ్ గెలుపుతో ఇండియా ఫైనల్స్కి చేరుకుంది.
We're delighted to hear that our captain turned your flight into a live sports update! At IndiGo, we aim to create an engaging and entertaining experience for our passengers. (1/2)
— IndiGo (@IndiGo6E) November 15, 2023
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..