Ballistic missile fired from nuclear submarine INS Arihant:భారత సైనిక సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుంది. భారతదేశ న్యూక్లియర్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్(ఎస్ఎల్బీఎం)ను అరిహంత్ నుంచి శుక్రవారం విజయవంతంగా ప్రయోగించినట్లు భారత రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. క్షిపణి నిర్ణయించిన విధంగా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు అధికారలు వెల్లడించారు.
₹ 1,200-Crore Afghan Heroin Caught: ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఇండియాకు తీసుకువస్తున్న హెరాయిన్ ను పట్టివేశారు అధికారులు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి 200 కిలోల హెరాయిన్ ను మొదటగా పాకిస్తాన్ తరలించి అక్కడ నుంచి ఇరాన్ పడవలో ఇండియా, శ్రీలంకకు తరలించేందుకు ప్రయత్నించారు. గురువారం ఇండియన్ నేవీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎస్ సి బి) కలిసి సముద్రంలో ఆపరేషన్ నిర్వహించి భారీ డ్రగ్స్ దందాను పట్టుకున్నారు. ఇరాన్ పడవలో ఏడు పొరల ప్రాకేజింగ్ తో హెరాయిన్…
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఇండియన్ నేవీ ఇవాళ ఒడిశా తీరంలోని ఛాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (VL-SRSAM) ను విజయవంతంగా పరీక్షించాయి.
INS Satpura, Indian Warship's Historic US Visit: భారత యుద్దనౌక ఐఎన్ఎస్ సాత్పురా అమెరికా పర్యటనలో చరిత్ర సృష్టించింది. ఓ భారత యుద్ధ నౌక అమెరికా పశ్చిమ తీరాన్ని చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ రికార్డును ఐఎన్ఎస్ సాత్పురా సొంతం చేసుకుంది. ఇండియాకు స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఐఎన్ఎస్ సాత్పురా ఈ చారిత్రాత్మక పర్యటన చేస్తోంది. అమెరికా పశ్చిమ తీరం కాలిఫోర్నియా లోని శాన్ డియాగోకు చేరుకుంది.
Salman Khan in Vishakapatnam: బాలీవుడ్ కండల వీరుడు, సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ విశాఖలో సందడి చేశాడు. ఓ సినిమా షూటింగ్లో భాగంగా విశాఖకు వచ్చిన హీరో సల్మాన్ ఖాన్.. షూటింగ్ విరామ సమయంలో నేవీ సిబ్బందితో కలిసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో పాల్గొన్నాడు. ఇండియన్ నేవీ తూర్పు కమాండ్ స్థావరమైన విశాఖపట్నంలోని నేవీ సిబ్బందితో సల్మాన్ ఖాన్ డ్యాన్సులు వేశాడు. అనంతరం నేవీ సిబ్బందితో కలిసి కిచెన్లో వంట చేశాడు. అంతేకాకుండా…
Indian Navy All Women Team Completes Surveillance Mission: భారత నారీ శక్తి ఎందులో తీసిపోదని మరోసారి నిరూపితం అయింది. ఇండియన్ నేవీకి చెందిన మహిళా బృందం తాజాగా రికార్డ్ సృష్టించింది. ఐదుగురు సభ్యులతో కూడిన మహిళా బృందం ఉత్తర అరేబియా సముద్రంలో నిఘా మిషన్ ను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. బుధవారం అత్యాధునిక డోర్నియర్ 228 విమానంలో ఉత్తర అరేబియా సముద్రంలో సముద్ర నిఘాను పూర్తి చేసింది. ఈ మిషన్ ద్వారా నారీ…
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక 'విక్రాంత్' నౌకాదళానికి అప్పగించబడింది. విస్తృతమైన వినియోగదారు అంగీకార ట్రయల్స్ తర్వాత కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్(సీఎస్ఎల్) 'విక్రాంత్'ను భారత నావికాదళానికి అప్పగించింది. స్వదేశీ విమాన వాహక నౌక 'విక్రాంత్'ను నిర్మించిన కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్.. ఇవాళ భారత నౌకాదళానికి అప్పగించి చరిత్రను సృష్టించింది.
భారత అమ్ములపొదిలో మరో క్షిపణి చేరింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) శుక్రవారం రోజు ఒడిశాలోని చాందీపూర్ తీరంలో ‘‘వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం’’ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ ( వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం) క్షిపణిని డీఆర్డీవో డెవలప్ చేసింది. ఇండియన్ నేవీతో కలిసి ఈ రోజు పరీక్షించారు. అత్యంత ఖచ్చితత్వంతో క్షిపణి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ క్షిపణిని యుద్ధ నౌకల నుంచి ప్రయోగించవచ్చు. ఆకాశం నుంచి వచ్చే శత్రు…