జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లా ప్రధాన కార్యాలయానికి 30 కిలోమీటర్ల దూరంలోని అడవులు, ఎత్తైన పర్వతాలతో చుట్టుముట్టబడిన దేసాలో సోమవారం సాయంత్రం 7.30 గంటలకు భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల తూటాలకు వీర జవాన్లు ధీటుగా సమాధానం చెప్పారు. కాగా.. ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా, సైనికుడు నాయక్ డి రాజేష్, కానిస్టేబుల్ బిజేంద్ర, అజయ్ సింగ్ గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.
భారత సైనికులు, జమ్ముకాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ముమ్మరం చేయగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు.. అందులో ఓ ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
PM Modi : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత సైన్యానికి చెందిన అనేక రక్షణ పరికరాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం దొరుకుతుందని తెలుస్తోంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ప్రశాంతంగా ఉన్నట్లు అందరూ భావించారు. కానీ.. ఉగ్రవాదులు ఇప్పుడు జమ్మూని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. జమ్మూ ప్రాంతంలో నెల వ్యవధిలో జరిగిన ఐదు పెద్ద ఉగ్ర దాడులు ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి.
Kathua Ambush: సోమవారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ అధికారులు మరణించారు. జమ్మూ లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు నక్కి, ఆర్మీ వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించిన ఘటనకు ప్రతీకారం తప్పకుండా తీర్చుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర అరమనే ఈ రోజు అన్నారు.
Encounter : జమ్మూకశ్మీర్లోని కుల్గామ్లో ఉగ్రవాదులను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఎనిమిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు కూడా వీరమరణం పొందారు.
దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లా చినిగామ్లో భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను వీరమరణం పొందారు.
భారత్-రష్యా జాయింట్ వెంచర్ అయిన ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఆర్ఆర్పీఎల్) 35 వేల ఏకే-203 కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిళ్లను భారత సైన్యానికి అందజేసింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ కింద తయారైన ఈ రైఫిల్స్ సైన్యాన్ని బలోపేతం చేస్తాయి. భారతదేశం సమీకరించిన కలాష్నికోవ్ ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్ను ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో తయారు చేశారు.
Agniveer: అగ్నివీరులకు ఇచ్చే పరిహారంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విధి నిర్వహణలో మరణించిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి కేంద్రం ఎలాంటి పరిహారం ఇవ్వలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.