Kathua Ambush: కథువా ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదు.. పాక్కి భారత్ వార్నింగ్..
- కథువా ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్..
- ప్రతీకారం తప్పదని ఉగ్రవాదులకు హెచ్చరిక..
- నిన్న జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు జవాన్లు..
- దాడిలో జేషే మహ్మద్ ఉగ్రసంస్థ హస్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kathua Ambush: సోమవారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ అధికారులు మరణించారు. జమ్మూ లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు నక్కి, ఆర్మీ వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించిన ఘటనకు ప్రతీకారం తప్పకుండా తీర్చుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర అరమనే ఈ రోజు అన్నారు. కథువా బద్నోటాలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు సంతాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దేశం ఎల్లప్పుడూ వారి సేవల్ని గుర్తు చేస్తుంటుందని, ఈ దాడి వెనక ఉన్న దుష్టశక్తుల్ని భారత్ ఓడిస్తుందని ఎక్స్ ద్వారా రక్షణ మంత్రిశాఖ ట్వీట్ చేసింది.
Read Also: PM Modi: రష్యా మాకు ‘ఆల్ వెదర్ ఫ్రెండ్’’.. ‘డిస్కో డాన్సర్’ గురించి ప్రస్తావన..
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
కథువాలోని మారుమూల మాచెడి ప్రాంతంలో ఉగ్రవాదులు పెట్రోలింగ్ పార్టీపై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు మరియు చాలా మంది గాయపడ్డారు. ఆర్మీ ట్రక్కులో మొత్తం 10 మంది సైనికులు ఉండగా, ఉగ్రవాదులు గ్రెనేడ్స్ విసిరి, కాల్పులకు పాల్పడ్డారు. దాడి అనంతరం అడవిలోకి పారిపోయారు. ఉగ్రవాదల్ని గుర్తించేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ దాడికి పాకిస్తాన్కి చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న కాశ్మీర్ టైగర్స్ బాధ్యత వహించింది. గత రెండు వారాల్లో ఆర్మీపై జరిగిన రెండో దాడి.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!