Operation Sarp Vinash 2.0: జమ్మూకశ్మీర్లో ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 షూరు..
- జమ్మూకశ్మీర్లో 55 మంది టెర్రరిస్టులున్నట్టు సమాచారం..
- ఇటివల జరిగిన ఉగ్రదాడుల్లో 10 మంది సైనికులు వీరమరణం..
- ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 ద్వారా పాక్ ఉగ్రవాదుల వేట
Operation Sarp Vinash 2.0: భారతదేశ సరిహద్దుల్లో నిత్యం ఉగ్రవాదుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గత ఆరు నెలల నుంచి ఇండియా- పాకిస్తాన్ బార్డర్లో విధులు నిర్వర్తిస్తున్న భారత భద్రతా దళాలపై విచక్షణారహితంగా ఉగ్రమూకలు కాల్పులు జరుపుతున్నాయి. దేశంలోకి అక్రమంగా చొరబడి విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా టెర్రరిస్టులు భారత సైనికుల ప్రాణాలను తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదలను సమూలంగా ఏరి వేసేందుకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also: BRS Leaders: నేడు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను సందర్శించనున్న బీఆర్ఎస్ టీం..
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఇండియన్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్కు శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించింది. హిట్లీస్ట్లో గుర్తించిన 55 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అంతమొందించడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0ను స్టార్ట్ చేయబోతుంది. అయితే, ఈ ఆపరేషన్ ఏకంగా ప్రధాని మోడీ ఆఫీసులో నుంచే పర్యవేక్షిస్తారు. ఈ మిషన్లో భాగంగా అందులో భాగస్వాములైన ఆర్మీ అధికారులు, ట్రూప్ నేరుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కు రిపోర్టు చేసేలా ఏర్పాట్లు చేశారు.
Read Also: Shah Rukh Khan: షారుఖ్ ఖాన్కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడుగా!
అయితే, కీలక ప్రాంతాల్లో దాదాపు 200 మంది స్నైపర్లు, 500 మంది పారాకమాండోలతో కలిసి 4 వేల అదనపు బలగాలను ఇండియన్ ఆర్మీ మోహరించింది. దేశంలోని ఇతర భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ భారత సైన్యం ఈ ఆపరేషన్కు ప్లాన్ చేసింది. ఇందులో స్థానికులను కూడా ఇందులో భాగస్వాములను చేసింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఆటకట్టించడానికి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ సహాయాన్ని భారత సైన్యం కోరింది. స్థానిక పరిస్థితులు, ఎదురయ్యే సవాళ్ల గురించి వీరికి పూర్తి అవగాహన ఉంటుంది అని ఆర్మీ చీఫ్ భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!