Operation Sarp Vinash 2.0: జమ్మూకశ్మీర్లో ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 షూరు..
- జమ్మూకశ్మీర్లో 55 మంది టెర్రరిస్టులున్నట్టు సమాచారం..
- ఇటివల జరిగిన ఉగ్రదాడుల్లో 10 మంది సైనికులు వీరమరణం..
- ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 ద్వారా పాక్ ఉగ్రవాదుల వేట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sarp Vinash 2.0: భారతదేశ సరిహద్దుల్లో నిత్యం ఉగ్రవాదుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గత ఆరు నెలల నుంచి ఇండియా- పాకిస్తాన్ బార్డర్లో విధులు నిర్వర్తిస్తున్న భారత భద్రతా దళాలపై విచక్షణారహితంగా ఉగ్రమూకలు కాల్పులు జరుపుతున్నాయి. దేశంలోకి అక్రమంగా చొరబడి విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా టెర్రరిస్టులు భారత సైనికుల ప్రాణాలను తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదలను సమూలంగా ఏరి వేసేందుకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also: BRS Leaders: నేడు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను సందర్శించనున్న బీఆర్ఎస్ టీం..
Also Read
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఇండియన్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్కు శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించింది. హిట్లీస్ట్లో గుర్తించిన 55 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అంతమొందించడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0ను స్టార్ట్ చేయబోతుంది. అయితే, ఈ ఆపరేషన్ ఏకంగా ప్రధాని మోడీ ఆఫీసులో నుంచే పర్యవేక్షిస్తారు. ఈ మిషన్లో భాగంగా అందులో భాగస్వాములైన ఆర్మీ అధికారులు, ట్రూప్ నేరుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కు రిపోర్టు చేసేలా ఏర్పాట్లు చేశారు.
Read Also: Shah Rukh Khan: షారుఖ్ ఖాన్కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడుగా!
అయితే, కీలక ప్రాంతాల్లో దాదాపు 200 మంది స్నైపర్లు, 500 మంది పారాకమాండోలతో కలిసి 4 వేల అదనపు బలగాలను ఇండియన్ ఆర్మీ మోహరించింది. దేశంలోని ఇతర భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ భారత సైన్యం ఈ ఆపరేషన్కు ప్లాన్ చేసింది. ఇందులో స్థానికులను కూడా ఇందులో భాగస్వాములను చేసింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఆటకట్టించడానికి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ సహాయాన్ని భారత సైన్యం కోరింది. స్థానిక పరిస్థితులు, ఎదురయ్యే సవాళ్ల గురించి వీరికి పూర్తి అవగాహన ఉంటుంది అని ఆర్మీ చీఫ్ భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..