Jammu Kashmir : జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడుల ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం ఉదయం కూడా అఖ్నూర్లోని బట్టల్ ప్రాంతంలో ఆర్మీ అంబులెన్స్ను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
Jammu Kashmir : జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య సోమవారం జరిగిన ఎనిమిది గంటలపాటు జరిగిన కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన వీర కుక్క ఫాంటమ్ వీరమరణం పొందింది.
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్టోబర్ 31న సైన్యంలో కలిసి చైనా సరిహద్దుల్లో దీపావళి వేడుకులు జరుపుకోనున్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలో భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న సైనికులతో కలిసి పండగ చేసుకోనున్నారు. ఇటీవల సమయాల్లో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతం చైనా, ఇండియా మధ్య ఘర్షణ పాయింట్లలో ఒకటిగా ఉంది.
Jammu Kashmir: ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లాలోని గుల్మార్గ్, గందర్బల్ జిల్లాలోని గగాంగీర్లో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుల ఆచూకీ కోసం భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. తంగ్ మార్గ్తో పాటు జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అక్టోబర్ 24న బారాముల్లాలో సైనిక వాహనంపై ఉగ్రదాడి చేయడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లతో సహా మరో ఇద్దరు మరణించారు. Read Also: Bomb threats: గుజరాత్ రాజ్కోట్ హోటళ్లకు వరస…
జమ్మూకశ్మీర్లో రోజురోజుకూ పెరుగుతున్న ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఆర్మీ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. బారాముల్లా ఉగ్రదాడిపై భారత సైన్యం ఉత్తర కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ శుక్రవారం స్పందించారు.
Jammu Kashmir: బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ సైట్లో భారీ ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదిని హతమార్చిందని, అలాగే ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఇంకా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉగ్రవాది నుంచి ఉపయోగించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదిని ఉమ్మడి బృందం హతమార్చిందని చినార్ కార్ప్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే రైఫిల్, 2…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదుగు తెగపడ్డారు. అమాయకుడైన నాన్ లోకల్ కార్మికుడిని హతమర్చారు. శుక్రవారం ఉదయం బీహార్కి చెందిన వలస కార్మికుడు రోడ్డు పక్కన మృతదేహంగా కనిపించాడు. దక్షిణ కాశ్మీర్లోని షోషియాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన ప్రాంతానికి వెంటనే భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు చేరుకుని, హత్యపై దర్యాప్తు ప్రారంభించారు.
Bactrian Camel: ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఏ సమయాన పరిస్థితి ఎలా మారిపోతుందో చెప్పలేము. దాంతో అక్కడ పనిచేస్తున్న సైనికులకు సరైన సదుపాయాలూ కల్పించలేని దుస్థితి ఉంది. ఈ పరిస్థితుల మధ్య సరిహద్దుల్లో పహరా కాసేందుకు, అలాగే అవసరమైన సామగ్రిని తీసుకెళ్ళేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై మిలటరీ బలగాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఇప్పుడు రెండు మూపురాల (Bactrian) ఒంటెలను రంగంలోకి తీసుకొచ్చారు. వీటిని ముక్యముగా బందోబస్తుకు ఉపయోగపడేలా, అలాగే బరువులు మోసేందుకు సహకరించేలా లేహ్ లోని…
Rajnath Singh: దేశ సరిహద్దులో భారత సైన్యం అలర్ట్ గా ఉందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అందువల్లే సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు జరగడం లేదన్నారు. కానీ, ఈ విషయంలో అజాగ్రత్త పనికి రాదు.. పొరుగు దేశాల నుంచి కవ్వింపు చర్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేశారు.