ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ఉగ్రదాడుల్లో సుమారు 166 మంది చనిపోయారు. ఈ దాడుల్లో జాతీయ భద్రతా దళం కమాండో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అతని ధైర్యం, తెగువ, త్యాగం దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని మేజర్ సందీప్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ చెప్పుకొచ్చారు.
LoC: భారత్ని కవ్వించి పాకిస్తాన్ ఆర్మీ మూల్యం చెల్లించుకుంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. ఎల్ఓసీని దాటే ప్రయత్నం చేసినట్లు భారత ఆర్మీ చెప్పింది. పాక్ ఆర్మీ కాల్పులకు భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఈ కాల్పుల్లో 4-5 మంది చొరబాటుదారులను హతమార్చినట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు చెప్పాయి. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి ప్రాంతంలో చొరబాటు ప్రయత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టామని సైన్యం తెలిపింది.
Encounter: జమ్మూ కాశ్మీర్ కథువాలో ఉగ్రవాదుల చొరబాటును భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. హిరానగర్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని సన్యాల్ గ్రామంలో అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో, భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు! ఈ ప్రాంతంలో ఇద్దరు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు…
ఇండియన్ ఆర్మీలో చేరాలని యూత్ కలలుకంటుంటారు. ఆర్మీ రిలీజ్ చేసే జాబ్ నోటిఫికేషన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD), టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్మన్, సైనిక్ ఫార్మా, సైనిక్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, మహిళా పోలీస్ పోస్టులను భర్తీ చేస్తారు. దీనితో పాటు, హవల్దార్…
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రం దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి డిఫెన్స్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశ భద్రతకు తెలంగాణ రాష్ట్రం ఎంతో సహకారం అందిస్తోందని, ఇప్పటికే హైదరాబాద్ రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, విభాగాలకు కేంద్రంగా మారిందని వెల్లడించారు. తెలంగాణలో డిఫెన్స్ పరిశ్రమలు విస్తృతంగా అభివృద్ధి…
SDLC Tragedy: తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్లో సంభవించిన ఘోర ప్రమాదం కారణంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్లో వందలాది మంది పాల్గొంటున్నారు. భారత సైన్యం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయబడింది. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సహాయక చర్యల్లో భాగంగా రెండు ఆర్మీ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF) నుంచి 120 మంది, ఎస్డీఆర్ఎఫ్ (SDRF)…
SLBC : తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్లో సంభవించిన ఘోర ప్రమాదం మరింత తీవ్రతను సంతరించుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సిబ్బంది టన్నెల్ లోపల చిక్కుకుపోవడంతో వారిని సురక్షితంగా బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF), భారత సైనిక బృందాలు (Indian Army Teams) రంగంలోకి దిగాయి. ప్రమాద స్థితిని అంచనా వేసి రక్షణ చర్యలను మరింత వేగవంతం చేయడానికి సింగరేణి…
Kishan Reddy : తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో జరిగిన SLBC టన్నెల్ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీశైలం ఎడమ కాలువ టన్నెల్లో కొంత భాగం కూలిపోవడంతో, అక్కడ పనిచేస్తున్న కార్మికులు సొరంగం లోపలే చిక్కుకుపోయారు. ఈ హఠాన్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు చేపట్టింది. సహాయక చర్యల కోసం రాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ విషాద ఘటనపై కేంద్ర బొగ్గు, గణుల శాఖ…
LOC : పూంచ్ జిల్లాలోని బాలకోట్ సెక్టార్లోని భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ సైన్యం నిన్న కాల్పులు జరిపింది. దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం కూడా పాకిస్తాన్ పోస్టులపై కాల్పులు జరిపి తగిన సమాధానం ఇచ్చింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇద్దరు భారత సైనికులు మరణించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది.