Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో భారీ సెర్చ్ ఆపరేషన్.. ఉగ్రవేట ముమ్మరం..
- జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భారీ సెర్చ్ ఆపరేషన్..
- ఉగ్రవేటను ముమ్మరం చేసిన ఆర్మీ.. పోలీసులు..
- ఇటీవల వరసగా ఉగ్రదాడులతో అప్రమత్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లాలోని గుల్మార్గ్, గందర్బల్ జిల్లాలోని గగాంగీర్లో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుల ఆచూకీ కోసం భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. తంగ్ మార్గ్తో పాటు జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అక్టోబర్ 24న బారాముల్లాలో సైనిక వాహనంపై ఉగ్రదాడి చేయడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లతో సహా మరో ఇద్దరు మరణించారు.
Read Also: Bomb threats: గుజరాత్ రాజ్కోట్ హోటళ్లకు వరస బాంబు బెదిరింపులు..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
ఈ ఘటనకు ముందు అక్టోబర్ 2న గంగర్బాల్ జిల్లాలోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారి సొరంగం నిర్మాణంలో పనిచేస్తున్న నిర్మాణ కార్మికులు, ఇతర సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వర్కర్స్తో పాటు ఒక డాక్టర్ మరణించారు. కార్మికులు, ఇతర సిబ్బంది తమ శిబిరాలకు తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నట్లుగా అనుమానిస్తున్నారు. మరోవైపు స్థానికేతర కూలీలను టార్గెట్ చేస్తున్నారు ఉగ్రవాదులు.
ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మాణాల చుట్టూ భద్రతా సిబ్బందిని కట్టుదిట్టం చేయాలని బుధవారం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశంచారు. గుల్మార్గ్లోని బుటాపత్రి ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన సైనికులు, కూలీలకు ఆయన నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్(సీఐకే) కాశ్మీర్ లోయలోని ఆరు జిల్లాల్లో ఆపరేషన్ నిర్వహించి, ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న రిక్రూటర్లను పట్టుకుంది. నగర్, గందర్బల్, పుల్వామా, అనంత్నాగ్, బుద్గాం, కుల్గాం జిల్లాల్లో దాడులు నిర్వహించినట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం. లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ‘తెహ్రీక్ లబైక్ యా ముస్లిం’ (టీఎల్ఎం) పేరుతో కొత్తగా ఏర్పడిన ఉగ్రవాద సంస్థ రిక్రూట్మెంట్ మాడ్యూల్ను దెబ్బతీసినట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!