LoC: సరిహద్దుల్లో కవ్వించి దెబ్బతిన్న పాక్ ఆర్మీ.. భారత్ కాల్పుల్లో ఐదుగురు హతం..
- ఎల్ఓసి వెంబడి భారత్ని కవ్వించి దెబ్బతిన్న పాక్ ఆర్మీ..
- సరిహద్దును దాటే ప్రయత్నం చేసిన పాక్..
- ఐదుగురు చొరబాటుదారుల్ని కాల్చివేసిన భారత సైన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LoC: భారత్ని కవ్వించి పాకిస్తాన్ ఆర్మీ మూల్యం చెల్లించుకుంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. ఎల్ఓసీని దాటే ప్రయత్నం చేసినట్లు భారత ఆర్మీ చెప్పింది. పాక్ ఆర్మీ కాల్పులకు భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఈ కాల్పుల్లో 4-5 మంది చొరబాటుదారులను హతమార్చినట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు చెప్పాయి. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి ప్రాంతంలో చొరబాటు ప్రయత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టామని సైన్యం తెలిపింది.
మంగళవారం, పాకిస్తాన్ సైనికులు, చొరబాటుదారులు కాల్పులు జరపడంపై భారత్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ వైపు భారీ ప్రాణనష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ కాల్పులు విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కృష్ణ ఘాటి సెక్టార్లో ఇలాంటి కాల్పుల ఘటన ఎదురైంది. అయితే, ఈ చొరబాటులను, పాక్ కవ్వింపులను భారత ఆర్మీ ధాటిగా తిప్పికొట్టింది. భారత్ వైపు నుంచి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది.
Also Read
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
- Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
Read Also: Vikarabad: కాల్వలో మహిళ మృతదేహం.. గుర్తు పట్టకుండ ముఖం కాల్చి..
ఎల్ఓసీ వెంబడి కాల్పుల సంఘటనలు పెరిగే అవకాశం..
గత రెండు నెలలుగా దక్షిణ పిర్ పంజాల్ ప్రాంతొంలో ఎల్ఓసీ వెంబడి సరిహద్దు కాల్పుల సంఘటనలు గణనీయంగా పెరిగాయి. పాకిస్తాన్ స్నిపింగ్, కాల్పులు, బోర్డర్ యాక్షన్ టీం ప్రయత్నాలు పెరిగినట్లు నివేదికలు వస్తున్నాయి. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండటాన్ని భారత్ సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఆర్మీ వర్గాల ప్రకారం, పాకిస్తాన్ దళాలు, పాక్ ఉగ్రవాదుల్ని భారత్లోకి చొప్పించడానికి ప్రయత్నిస్తోంది. పాక్ అంతర్గత సమస్యల నుంచి అక్కడి ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత్లో ఏదైనా దాడి చేయాలనే ఉద్దేశంలోనే పాక్ ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తోంది. వీరిని సరిహద్దు దాటించేందుకు, భారత సైన్యం దృష్టిని మళ్లించేందుకు సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
-
Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
-
Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
-
Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
-
Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?