LoC: సరిహద్దుల్లో కవ్వించి దెబ్బతిన్న పాక్ ఆర్మీ.. భారత్ కాల్పుల్లో ఐదుగురు హతం..
- ఎల్ఓసి వెంబడి భారత్ని కవ్వించి దెబ్బతిన్న పాక్ ఆర్మీ..
- సరిహద్దును దాటే ప్రయత్నం చేసిన పాక్..
- ఐదుగురు చొరబాటుదారుల్ని కాల్చివేసిన భారత సైన్యం..
LoC: భారత్ని కవ్వించి పాకిస్తాన్ ఆర్మీ మూల్యం చెల్లించుకుంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. ఎల్ఓసీని దాటే ప్రయత్నం చేసినట్లు భారత ఆర్మీ చెప్పింది. పాక్ ఆర్మీ కాల్పులకు భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఈ కాల్పుల్లో 4-5 మంది చొరబాటుదారులను హతమార్చినట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు చెప్పాయి. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి ప్రాంతంలో చొరబాటు ప్రయత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టామని సైన్యం తెలిపింది.
మంగళవారం, పాకిస్తాన్ సైనికులు, చొరబాటుదారులు కాల్పులు జరపడంపై భారత్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ వైపు భారీ ప్రాణనష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ కాల్పులు విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కృష్ణ ఘాటి సెక్టార్లో ఇలాంటి కాల్పుల ఘటన ఎదురైంది. అయితే, ఈ చొరబాటులను, పాక్ కవ్వింపులను భారత ఆర్మీ ధాటిగా తిప్పికొట్టింది. భారత్ వైపు నుంచి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది.
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
Read Also: Vikarabad: కాల్వలో మహిళ మృతదేహం.. గుర్తు పట్టకుండ ముఖం కాల్చి..
ఎల్ఓసీ వెంబడి కాల్పుల సంఘటనలు పెరిగే అవకాశం..
గత రెండు నెలలుగా దక్షిణ పిర్ పంజాల్ ప్రాంతొంలో ఎల్ఓసీ వెంబడి సరిహద్దు కాల్పుల సంఘటనలు గణనీయంగా పెరిగాయి. పాకిస్తాన్ స్నిపింగ్, కాల్పులు, బోర్డర్ యాక్షన్ టీం ప్రయత్నాలు పెరిగినట్లు నివేదికలు వస్తున్నాయి. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండటాన్ని భారత్ సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఆర్మీ వర్గాల ప్రకారం, పాకిస్తాన్ దళాలు, పాక్ ఉగ్రవాదుల్ని భారత్లోకి చొప్పించడానికి ప్రయత్నిస్తోంది. పాక్ అంతర్గత సమస్యల నుంచి అక్కడి ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత్లో ఏదైనా దాడి చేయాలనే ఉద్దేశంలోనే పాక్ ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తోంది. వీరిని సరిహద్దు దాటించేందుకు, భారత సైన్యం దృష్టిని మళ్లించేందుకు సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!