CM Revanth Reddy : దేశ రక్షణలో తెలంగాణది కీలక పాత్ర
- డిఫెన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- దేశ రక్షణలో తెలంగాణది కీలక పాత్ర
- హైదరాబాద్ను రక్షణ పరిశ్రమల కేంద్రంగా మార్చే దిశగా ప్రణాళికలు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రం దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి డిఫెన్స్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశ భద్రతకు తెలంగాణ రాష్ట్రం ఎంతో సహకారం అందిస్తోందని, ఇప్పటికే హైదరాబాద్ రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, విభాగాలకు కేంద్రంగా మారిందని వెల్లడించారు.
తెలంగాణలో డిఫెన్స్ పరిశ్రమలు విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయని, సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా లక్షలాది మంది యువతకు అవగాహన కల్పిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రక్షణ పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణను కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
Also Read
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
సాంప్రదాయ ఇంజనీరింగ్తో పాటు రక్షణ పరిశ్రమల అభివృద్ధికి డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ భద్రతను పరిరక్షించడం ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉందో యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రక్షణ పరిశ్రమల్లో పనిచేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దేశ సేవలో పాలుపంచుకునే అవకాశం లభిస్తుందని అన్నారు.
మిస్సైల్స్ తయారీ పరిశ్రమలు అయిన డీఆర్డీఏల్, బీడీఎల్, డీఆర్డీవో, మిధానీ లాంటి సంస్థలు తెలంగాణలోనే ఉండటం గర్వించదగిన విషయం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బెంగళూరులో ఉన్న రక్షణ పరిశోధన, తయారీ పరిశ్రమల మాదిరిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రక్షణ పరిశ్రమల కారిడార్లను అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
రక్షణ శాఖ దేశ భద్రతను కాపాడటంలో కీలక భూమిక పోషిస్తుందని సీఎం పేర్కొన్నారు. అదేవిధంగా దేశ భద్రత భవిష్యత్తు యువతపై ఆధారపడిందని, వారు మరింత చైతన్యంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా యువతకు భారత త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్) గురించి అవగాహన కల్పిస్తామని తెలిపారు.
హైదరాబాద్లో మూడు రోజుల పాటు జరగనున్న ఈ డిఫెన్స్ ఎగ్జిబిషన్లో దేశ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రదర్శించనున్నారు. రక్షణ రంగంలో భారతదేశం అభివృద్ధి చేసిన పరికరాలు, ఆయుధ వ్యవస్థలు, మిస్సైల్స్, సాంకేతిక పరిజ్ఞానం ఈ ప్రదర్శనలో ప్రాముఖ్యత పొందనున్నాయి. త్రివిధ దళాల గురించి విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించేందుకు రక్షణ శాఖ ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేయనుంది.
ఈ ప్రదర్శన ద్వారా దేశ భద్రతకు సంబంధించి యువతలో అవగాహన పెంపొందించడంతో పాటు, రక్షణ రంగంలో అభిరుచి కలిగిన వారికి ఉపాధి అవకాశాల గురించి స్పష్టత లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ పరిశ్రమల అభివృద్ధి ఎంతో అవసరమని, తెలంగాణ ఈ మార్గంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
IND vs NZ: ఇండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ రోహిత్ ఔట్..!
తాజావార్తలు
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!