Indian forces: భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హోం మంత్రిత్వ శాఖ కింద వివిధ రకాల పారామిలిటరీ దళాలు ఉంటాయి. అస్సాం రైఫిల్స్ (AR), సరిహద్దు భద్రతా దళం (BSF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB) దళాలు సరిహద్దు రక్షణ దళాలుగా పనిచేస్తాయి. ఇవి మనదేశంలోని సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తాయి. వీటిలో పాటు సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ…
Vijay Devarakonda : శత్రుదేశం పాకిస్థాన్ పై భారత్ సాగిస్తున్న యుద్ధానికి దేశమంతా మద్దతు పలుకుతోంది. ఇలాంటి టైమ్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఇండియన్ ఆర్మీకి మద్దతు తెలిపాడు. మొదటి నుంచి ఇండియన్ ఆర్మీ మీద ఎప్పటికప్పుడ పోస్టులు పెడుతూ మద్దతు తెలుపుతున్నాడు విజయ్. మొన్న ఆపరేషన్ సింధూర్ పై కూడా ప్రశంసలు కురిపించాడు. కానీ పాక్ చేస్తున్న దొంగ దాడులను మన ఇండియన్ ఆర్మీ ధీటుగా ఎదుర్కుంటుంది. ఈ క్రమంలోనే ఇండియన్…
Rajamouli : ఇండియా-పాకిస్థాన్ యుద్ధ వాతావరణం ఇంకా పెరుగుతోంది. పాక్ కవ్వింపు చర్యలకు ఇండియన్ ఆర్మీ ధీటైన సమాధానం ఇస్తోంది. నిన్న రాత్రి డ్రోన్ దాడులకు దాయాది పాక్ తెగించింది. కానీ ఇండియన్ ఆర్మీ ధీటుగా జవాబిచ్చింది. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను కుప్ప కూల్చేసింది మన ఆర్మీ. రాత్రంతా పాకిస్థాన్ దాడులను తిప్పి కొడుతూనే.. పాక్ కు గట్టి బుద్ధి చెప్పింది. పాక్ లోని ప్రముఖ పోర్టులు, డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసి ఇండియన్ ఆర్మీ సత్తా…
Virat Kohli : పాకిస్థాన్-భారత్ సాగిస్తున్న యుద్ధ వాతావరణ సమయంలో ప్రతి ఒక్కరూ ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటించారు. ‘ఈ క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడుతున్న ఆర్మీకి బిగ్ సెల్యూట్. వారు, వారి కుటుంబ త్యాగాలను వెలకట్టలేం. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. విరాట్ తో పాటు ఇతర క్రీడాకారులు…
High Alert In Rajasthan: భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ లో హై అలర్ట్ ప్రకటించారు. జై సల్మేర్, రాంఘడ్, బడ్ మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్ లో లాంటి సరిహద్దు జిల్లాల్లో బ్లాక్ అవుట్ విధించబడింది.
Rohit Sharma: భారత్–పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలలో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా పాకిస్థాన్ కూడా జమ్మూ కశ్మీర్ తో పాటు ఇతర ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. Also Read: Pakistan: కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.. పైసల…
ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి కీలక సూచనలు వచ్చాయని ప్రకటించారు చండీగఢ్ డిప్యూటీ కమిషనర్.. దాడి జరిగే అవకాశం ఉందని వైమానిక దళ కేంద్రం నుండి వైమానిక హెచ్చరిక అందింది.. సైరన్లు మోగుతున్నాయి.. అందరూ ఇంటి లోపలే ఉండండి.. ఇంట్లో బాల్కనీలకు కూడా దూరంగా ఉండాలని సూచించారు చండీగఢ్ డిప్యూటీ కమిషనర్..
Rajnath Singh : భారతదేశంలో పాక్ దాడుల నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితిని సమీక్షించేందుకు కీలక స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి జరిగిన ఘర్షణాత్మక దాడుల అనంతరం దేశ రాజధానిలో రక్షణ వ్యవస్థ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ కీలక భేటీకి నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా పాల్గొన్నారు. వారందరూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థుతులపై సమగ్రంగా చర్చించారని తెలుస్తోంది.…
పాక్ పన్నాగాలను తిప్పికొడుతూనే.. ముందుస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది భారత్.. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో అంతటా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.. జమ్మూతో పాటు కాశ్మీర్ అంతటా అన్ని పాఠశాలలు నేడు మరియు రేపు మూసివేయబడతాయి..
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పాక్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వీరేంద్ర సెహ్వాగ్.. పాక్ యుద్ధం కోరుకుంది.. దానికి భారత్ సరైన గుణపాఠం చెబుతుందని పేర్కొన్నాడు.. 'ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ మౌనంగా ఉండాలి.. కానీ, ఆ అవకాశాన్ని వదులుకొని యుద్ధం కోరుకుంటుంది.. ఉగ్రవాదుల ఆస్తులను రక్షించడమే కాదు.. వారి గురించి ఎక్కువగా మాట్లాడటం చేశారు.. దానికి భారత భద్రతా దళాలు తప్పకుండా సరైన సమాధానం ఇస్తుంది.. పాకిస్తాన్ ఎప్పటికీ మరిచిపోలేని రీతిలో ఉంటుంది' అంటూ ట్వీట్ చేశారు…