Operation Sindoor: ఐసీ 814 హైజాక్ ఉగ్రవాదులతో సహా 100 మందిని హతం చేశాం
- 100 మందికిపైగా ఉగ్రవాదుల్ని చంపేశాం..
- చనిపోయిన వారిలో ఐసీ 814 హైజాక్ ఉగ్రవాదులు..
- ఆపరేషన్ సిందూర్పై త్రివిధ దళాల అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత తొలిసారిగా భారత త్రివిధ దళాలు మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజీఎంఓ పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల్ని టార్గెట్ చేస్తూ చేసినట్లు సైనికాధికారులు చెప్పారు. పహల్గామ్ దాడి తర్వాత బాధితుల కుటుంబాల ఆవేదనను దేశం మొత్తం చూసిందని వారు చెప్పారు. పాకిస్తాన్లోని మొత్తం 09 టెర్రర్ క్యాంపుల్లో కొన్ని పీఓజేకే, పాక్ పంజాబ్లో ఉన్నట్లు చెప్పారు. ప్రతీ లొకేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించి నేలమట్టం చేసినట్లు మిలిటరీ డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు.
అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ వంటి వారికి శిక్షణ ఇచ్చిన మురిడ్కే వంటి స్థావరాలను టార్గెట్ చేసినట్లు సైనికాధికారులు చెప్పారు. ఐసీ 814 విమాన హైజాక్లో పాల్గొన్న ఉగ్రవాదులను చంపేసినట్లు వెల్లడించారు. వీరిలో కరగుట్టిన ఉగ్రవాదులు యూసఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదస్సిర్ అహ్మద్ వంటి వారిని హతం చేసినట్లు చెప్పారు. పుల్వామా టెర్రర్ అటాక్కి పాల్పడిన వారిని కూడా హతమార్చినట్లు తెలిపారు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
Read Also: Budget Phones: రూ.15,000 లోపే అదిరిపోయే ఫీచర్స్ తో బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇదిగో..!
బహవల్పూర్, మురిడ్కే వంటి క్రూరమైన ఉగ్రశిబిరాలను నాశనం చేసినట్లు ఎయిర్ఫోర్స్ డీజీఎంఓ ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పారు. ఎయిర్ టూ సర్ఫేస్ క్షిపణులను ఉపయోగించినట్లు వెల్లడించారు. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా క్షిపణల్ని ప్రయోగించి ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఉగ్రవాద శిభిరాల్లో ఉన్న 100కు పైగా టెర్రరిస్టుల్ని హతం చేసినట్లు వెల్లడించారు. పాకిస్తాన్ మిలిటరీ పౌరులు, మిలిటరీ స్థావరాలపై దాడులకు ప్రయత్నించినట్లు చెప్పారు
‘‘మురిద్కేలో 4 టార్గెట్స్పై కచ్చితత్వంతో దాడి చేశాం డ్రోన్లు, ఎయిర్క్రాఫ్ట్స్ను భారత భూభాగంపై పాక్ ప్రయోగించింది.. 8,9 తేదీల్లో శ్రీనగర్ నుంచి నలియా వరకు డ్రోన్లతో దాడి చేశారు.. పాక్ డ్రోన్లు, UAVల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాం.. ఉగ్రవాదులు, వారికి సంబంధించిన స్థలాలను మాత్రమే టార్గెట్ చేశాం’’ అని ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!