Operation Sindoor: ఐసీ 814 హైజాక్ ఉగ్రవాదులతో సహా 100 మందిని హతం చేశాం
- 100 మందికిపైగా ఉగ్రవాదుల్ని చంపేశాం..
- చనిపోయిన వారిలో ఐసీ 814 హైజాక్ ఉగ్రవాదులు..
- ఆపరేషన్ సిందూర్పై త్రివిధ దళాల అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత తొలిసారిగా భారత త్రివిధ దళాలు మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజీఎంఓ పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల్ని టార్గెట్ చేస్తూ చేసినట్లు సైనికాధికారులు చెప్పారు. పహల్గామ్ దాడి తర్వాత బాధితుల కుటుంబాల ఆవేదనను దేశం మొత్తం చూసిందని వారు చెప్పారు. పాకిస్తాన్లోని మొత్తం 09 టెర్రర్ క్యాంపుల్లో కొన్ని పీఓజేకే, పాక్ పంజాబ్లో ఉన్నట్లు చెప్పారు. ప్రతీ లొకేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించి నేలమట్టం చేసినట్లు మిలిటరీ డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు.
అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ వంటి వారికి శిక్షణ ఇచ్చిన మురిడ్కే వంటి స్థావరాలను టార్గెట్ చేసినట్లు సైనికాధికారులు చెప్పారు. ఐసీ 814 విమాన హైజాక్లో పాల్గొన్న ఉగ్రవాదులను చంపేసినట్లు వెల్లడించారు. వీరిలో కరగుట్టిన ఉగ్రవాదులు యూసఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదస్సిర్ అహ్మద్ వంటి వారిని హతం చేసినట్లు చెప్పారు. పుల్వామా టెర్రర్ అటాక్కి పాల్పడిన వారిని కూడా హతమార్చినట్లు తెలిపారు.
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
Read Also: Budget Phones: రూ.15,000 లోపే అదిరిపోయే ఫీచర్స్ తో బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇదిగో..!
బహవల్పూర్, మురిడ్కే వంటి క్రూరమైన ఉగ్రశిబిరాలను నాశనం చేసినట్లు ఎయిర్ఫోర్స్ డీజీఎంఓ ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పారు. ఎయిర్ టూ సర్ఫేస్ క్షిపణులను ఉపయోగించినట్లు వెల్లడించారు. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా క్షిపణల్ని ప్రయోగించి ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఉగ్రవాద శిభిరాల్లో ఉన్న 100కు పైగా టెర్రరిస్టుల్ని హతం చేసినట్లు వెల్లడించారు. పాకిస్తాన్ మిలిటరీ పౌరులు, మిలిటరీ స్థావరాలపై దాడులకు ప్రయత్నించినట్లు చెప్పారు
‘‘మురిద్కేలో 4 టార్గెట్స్పై కచ్చితత్వంతో దాడి చేశాం డ్రోన్లు, ఎయిర్క్రాఫ్ట్స్ను భారత భూభాగంపై పాక్ ప్రయోగించింది.. 8,9 తేదీల్లో శ్రీనగర్ నుంచి నలియా వరకు డ్రోన్లతో దాడి చేశారు.. పాక్ డ్రోన్లు, UAVల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాం.. ఉగ్రవాదులు, వారికి సంబంధించిన స్థలాలను మాత్రమే టార్గెట్ చేశాం’’ అని ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!