Rajnath Singh : భారతదేశంలో పాక్ దాడుల నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితిని సమీక్షించేందుకు కీలక స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి జరిగిన ఘర్షణాత్మక దాడుల అనంతరం దేశ రాజధానిలో రక్షణ వ్యవస్థ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ కీలక భేటీకి నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా పాల్గొన్నారు. వారందరూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థుతులపై సమగ్రంగా చర్చించారని తెలుస్తోంది.…
పాక్ పన్నాగాలను తిప్పికొడుతూనే.. ముందుస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది భారత్.. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో అంతటా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.. జమ్మూతో పాటు కాశ్మీర్ అంతటా అన్ని పాఠశాలలు నేడు మరియు రేపు మూసివేయబడతాయి..
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పాక్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వీరేంద్ర సెహ్వాగ్.. పాక్ యుద్ధం కోరుకుంది.. దానికి భారత్ సరైన గుణపాఠం చెబుతుందని పేర్కొన్నాడు.. 'ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ మౌనంగా ఉండాలి.. కానీ, ఆ అవకాశాన్ని వదులుకొని యుద్ధం కోరుకుంటుంది.. ఉగ్రవాదుల ఆస్తులను రక్షించడమే కాదు.. వారి గురించి ఎక్కువగా మాట్లాడటం చేశారు.. దానికి భారత భద్రతా దళాలు తప్పకుండా సరైన సమాధానం ఇస్తుంది.. పాకిస్తాన్ ఎప్పటికీ మరిచిపోలేని రీతిలో ఉంటుంది' అంటూ ట్వీట్ చేశారు…
Indian Army : పాకిస్తాన్ నిన్న రాత్రి డ్రోన్ దాడులపై భారత ఆర్మీ తీవ్రంగా స్పందించింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి పాక్ డ్రోన్లు భారత భూభాగంలోకి చొరబాటుకు యత్నించాయని, కొన్ని ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత ఆర్మీ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్లోని పలు సున్నిత ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని అధికారులు పేర్కొన్నారు. పాక్ కుట్రలను ముందుగానే గుర్తించిన భారత భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. LOC వెంబడి పాక్ డ్రోన్ల…
నిన్న రాత్రి, పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) మరియు అంతర్జాతీయ సరిహద్దులు (IB) వెంబడి వివిధ ప్రదేశాలకు డ్రోన్లను పంపడానికి పాక్ విఫలయత్నం చేసింది.. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా మరియు పఠాన్కోట్ ప్రాంతాలలో పాక్ చర్యలకు భారత్ తిప్పికొట్టింది.. భారత ఆర్మీ వైమానిక రక్షణ విభాగాలు ఉపయోగించి.. పెద్ద ఎత్తున కౌంటర్-డ్రోన్ ఆపరేషన్లో 50కి పైగా పాక్ డ్రోన్లను విజయవంతంగా తటస్థీకరించింది..
జమ్మూ కాశ్మీర్లో రాత్రి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినా.. ఉదయం పరిస్థితి సాధారణంగా ఉంది.. భారత వైమానిక రక్షణ విభాగాలు.. రాత్రిపూట పాకిస్తాన్ డ్రోన్లు మరియు క్షిపణులను అడ్డుకున్నాయి. పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రజల నివాస ప్రాంతాలపై దాడులకు పాల్పడింది.. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉన్న పాకిస్తాన్ సైన్యం.. ప్రజల కార్లను లక్ష్యంగా చేసుకుని కాల్పలకు తెగబడింది..
పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్.. పాకిస్థాన్పై ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ మంగళవారం అర్ధరాత్రి పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. ఈ మేరకు ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా టెర్రరిస్టులు మృతి చెందినట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఈ మెరుపు దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది. పాక్పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్థాన్ గురువారం రాత్రి భారత్లోని అనేక ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం పాకిస్థాన్లోని వివిధ ప్రధాన నగరాలపై సంయుక్త దాడులు ప్రారంభించాయి. ఈ దాడి కాస్త క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో పాకిస్థాన్ లోని సాధారణ ప్రజలు, అధికారులు భయపడుతున్నారు. చాలా మంది పాక్ అధికారులు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి అధికారులు విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించిందని పలు మీడియా…
జమ్మూ కశ్మీర్లోని సాంబాలో ఒక పెద్ద చొరబాటు ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. ఎల్ఓసీలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్థాన్ వైపు నుంచి పెద్ద ఎత్తు కాల్పులు జరుగుతున్నాయి. భారత ఆర్మీ తగిన సమాధానం ఇస్తోంది. అయితే.. భారత్లో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆర్మీని పాక్ అడ్డుకుంది. అర్ధరాత్రి జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ (LOC) దగ్గర పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఆ ప్రాంతమంతా చీకటి అలుముకుంది.
భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్పై భారత సైన్యం దాడి చేసింది. భారత సైన్యం ఇస్లామాబాద్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, మిస్సైల్లతో దాడికి దిగింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ అధికారిక నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించాయి. దీంతో అప్రమత్తమైన పాకిస్థాన్ సైన్యం ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించింది.