Operation Sindoor: ‘నా సిందూరాన్ని బార్డర్కు పంపుతున్నా’.. నవ వధువు సంచలన నిర్ణయం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో అప్రమత్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెలవుల్లో ఉన్న భారత జవాన్లను వారి విధుల్లోకి తిరిగి రావాలని ఆర్మీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో వెంటనే ఆర్మీ సైనికులు కుటుంబాలను వదిలి తిరిగి సరిహద్దుల వైపు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ అనే భారత సైనికుడి పరిస్థితి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Read Also: IND PAK War: పాక్ ఎన్ని డ్రోన్స్, క్షిపణులను ప్రయోగించినా భారత్ ఇట్టే కూల్చేస్తోంది.. కారణాలేంటి?
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ఈ నెల 5న అతను యామినీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు సైనికుడు మనోజ్ పాటిల్. పెళ్లయి కేవలం మూడు రోజులు కూడా కాకముందే, అతనికి ఆర్మీ నుంచి పిలుపు వచ్చింది. “ఆపరేషన్ సిందూర్” పేరిట భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక కార్యకలాపాలు జరుగుతున్న దృష్ట్యా, అతను తిరిగి విధుల్లో చేర్చాల్సిన అవసరం ఏర్పడింది. అయి సమయంలో ఎవరూ ఊహించని స్థైర్యాన్ని ప్రదర్శించింది అతని భార్య యామినీ. వివాహం అయి మూడు రోజులు కూడా కాకముందే, తన భర్తను సరిహద్దుకి పంపిస్తూ “దేశ రక్షణే మాకు ముఖ్యం. అందుకోసమే నా సింధూరాన్ని బార్డర్కు పంపిస్తున్నా” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ మాటలు విన్న నెటిజన్స్ దేశభక్తికి అసలైన నిర్వచనం ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Terrorists Killed: పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి.. ఐదుగురు కీలక టెర్రరిస్టులు హతం!
ఈ సంఘటన స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలను గుర్తుకు తెస్తోంది. “వందేమాతరం” అంటూ రైలు ఎక్కించి పంపిన దృశ్యం నాటి పోరాట స్ఫూర్తిని గుర్తు చేసింది. మన దేశంలో ఇలాంటి కుటుంబాలు ఉన్నాయంటే, ఈ నేలపై దేశభక్తి ఇంకా నిలిచే ఉందనే నమ్మకం కలుగుతోంది. ఇలాంటి వారిగురించి ఎంత చెప్పిన తక్కువే.. ఏమిచ్చి తీర్చుకోగలం వీళ్ల రుణం..! జైహింద్..!
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!