Operation Sindoor: ‘నా సిందూరాన్ని బార్డర్కు పంపుతున్నా’.. నవ వధువు సంచలన నిర్ణయం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో అప్రమత్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెలవుల్లో ఉన్న భారత జవాన్లను వారి విధుల్లోకి తిరిగి రావాలని ఆర్మీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో వెంటనే ఆర్మీ సైనికులు కుటుంబాలను వదిలి తిరిగి సరిహద్దుల వైపు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ అనే భారత సైనికుడి పరిస్థితి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Read Also: IND PAK War: పాక్ ఎన్ని డ్రోన్స్, క్షిపణులను ప్రయోగించినా భారత్ ఇట్టే కూల్చేస్తోంది.. కారణాలేంటి?
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఈ నెల 5న అతను యామినీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు సైనికుడు మనోజ్ పాటిల్. పెళ్లయి కేవలం మూడు రోజులు కూడా కాకముందే, అతనికి ఆర్మీ నుంచి పిలుపు వచ్చింది. “ఆపరేషన్ సిందూర్” పేరిట భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక కార్యకలాపాలు జరుగుతున్న దృష్ట్యా, అతను తిరిగి విధుల్లో చేర్చాల్సిన అవసరం ఏర్పడింది. అయి సమయంలో ఎవరూ ఊహించని స్థైర్యాన్ని ప్రదర్శించింది అతని భార్య యామినీ. వివాహం అయి మూడు రోజులు కూడా కాకముందే, తన భర్తను సరిహద్దుకి పంపిస్తూ “దేశ రక్షణే మాకు ముఖ్యం. అందుకోసమే నా సింధూరాన్ని బార్డర్కు పంపిస్తున్నా” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ మాటలు విన్న నెటిజన్స్ దేశభక్తికి అసలైన నిర్వచనం ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Terrorists Killed: పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి.. ఐదుగురు కీలక టెర్రరిస్టులు హతం!
ఈ సంఘటన స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలను గుర్తుకు తెస్తోంది. “వందేమాతరం” అంటూ రైలు ఎక్కించి పంపిన దృశ్యం నాటి పోరాట స్ఫూర్తిని గుర్తు చేసింది. మన దేశంలో ఇలాంటి కుటుంబాలు ఉన్నాయంటే, ఈ నేలపై దేశభక్తి ఇంకా నిలిచే ఉందనే నమ్మకం కలుగుతోంది. ఇలాంటి వారిగురించి ఎంత చెప్పిన తక్కువే.. ఏమిచ్చి తీర్చుకోగలం వీళ్ల రుణం..! జైహింద్..!
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..