Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్
- మెట్రో స్టేషన్లు తెరవకపోతే జోక్యం చేసుకుంటా
- సీజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. గత సోమవారం ఆందోళనలు ఉధృతం అయ్యాయి. విద్యార్థులపై లాఠీఛార్జ్ కారణంగా పలువురు గాయపడ్డారు. అప్పటి నుంచి ఉద్యమం ఉధృతం అయింది. విపక్ష పార్టీలు కూడా మద్దతుగా నిరసనలు తెలుపుతున్నారు.
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మూసేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులతో పాటు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో స్టేషన్లు మూసివేయడంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్న భోజన విరామం (లంచ్)లోపు సమస్యకు పరిష్కారం లభించకపోతే తానే స్వయంగా జోక్యం చేసుకుంటానని స్పష్టం చేశారు. ఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేత కారణంగా న్యాయవాదులు, వ్యాజ్యదారులు, సుప్రీంకోర్టు సిబ్బంది కోర్టుకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తరఫున వినతిపత్రం దాఖలైంది.
Also Read
- Amit Shah-Om Birla: లోక్సభ స్పీకర్కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
- NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్షీట్
- Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఎస్సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్తో పాటు సమీపంలోని ఇతర స్టేషన్లను కూడా మూసివేయడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, వ్యాజ్యదారులు సుప్రీంకోర్టుకు చేరుకోలేకపోతున్నారని వివరించారు. ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా న్యాయవాదులు కోర్టుకు హాజరు కాలేకపోయినా… కేవలం ఆ కారణంతో ఏ కేసులోనూ ప్రతికూల ఉత్తర్వులు జారీ చేయొద్దని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ను పూర్తిగా మూసివేయకుండా… న్యాయవాదులు, వ్యాజ్యదారులు, కోర్టు రిజిస్ట్రీ సిబ్బందికి మాత్రమే పరిమిత ప్రవేశం కల్పించాలని వికాస్ సింగ్ కోర్టును కోరారు. మెట్రో నుంచి బయటకు వచ్చే దగ్గర భద్రతా తనిఖీలు నిర్వహించి, సుప్రీంకోర్టు ప్రాక్సిమిటీ కార్డు లేదా అధికారిక గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే బయటకు అనుమతించాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన సీజేఐ.. ఢిల్లీ మెట్రో అధికారులతో సంప్రదించి ఈ అంశాన్ని పరిశీలించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు పరిపాలన విభాగాన్ని ఆదేశించినట్లు తెలిపారు.
‘‘ఈ ఉదయమే అధికారులకు సమాచారం ఇచ్చాను. వారు మెట్రో అధికారులతో చర్చిస్తున్నారు. ఇది ఒక సాధ్యమైన పరిష్కారంగా పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం వరకు సమస్య పరిష్కారమైతే మంచిదే. లేకపోతే నా జోక్యం అవసరమైతే నేను తప్పకుండా జోక్యం చేసుకుంటాను.’’ అని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు.
దేశ రాజధానిలో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) భద్రతా కారణాల దృష్ట్యా సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్తో పాటు మొత్తం 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్ను ఎలా నడిపించారు?
-
Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
-
Explainer: ఒకే ఒక హాస్పిటల్ బిల్లు.. మొత్తం సేవింగ్స్ ఊస్ట్..!
-
Toxic : ‘టాక్సిక్’ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..