Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్
- మెట్రో స్టేషన్లు తెరవకపోతే జోక్యం చేసుకుంటా
- సీజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. గత సోమవారం ఆందోళనలు ఉధృతం అయ్యాయి. విద్యార్థులపై లాఠీఛార్జ్ కారణంగా పలువురు గాయపడ్డారు. అప్పటి నుంచి ఉద్యమం ఉధృతం అయింది. విపక్ష పార్టీలు కూడా మద్దతుగా నిరసనలు తెలుపుతున్నారు.
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మూసేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులతో పాటు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో స్టేషన్లు మూసివేయడంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్న భోజన విరామం (లంచ్)లోపు సమస్యకు పరిష్కారం లభించకపోతే తానే స్వయంగా జోక్యం చేసుకుంటానని స్పష్టం చేశారు. ఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేత కారణంగా న్యాయవాదులు, వ్యాజ్యదారులు, సుప్రీంకోర్టు సిబ్బంది కోర్టుకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తరఫున వినతిపత్రం దాఖలైంది.
Also Read
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఎస్సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్తో పాటు సమీపంలోని ఇతర స్టేషన్లను కూడా మూసివేయడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, వ్యాజ్యదారులు సుప్రీంకోర్టుకు చేరుకోలేకపోతున్నారని వివరించారు. ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా న్యాయవాదులు కోర్టుకు హాజరు కాలేకపోయినా… కేవలం ఆ కారణంతో ఏ కేసులోనూ ప్రతికూల ఉత్తర్వులు జారీ చేయొద్దని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ను పూర్తిగా మూసివేయకుండా… న్యాయవాదులు, వ్యాజ్యదారులు, కోర్టు రిజిస్ట్రీ సిబ్బందికి మాత్రమే పరిమిత ప్రవేశం కల్పించాలని వికాస్ సింగ్ కోర్టును కోరారు. మెట్రో నుంచి బయటకు వచ్చే దగ్గర భద్రతా తనిఖీలు నిర్వహించి, సుప్రీంకోర్టు ప్రాక్సిమిటీ కార్డు లేదా అధికారిక గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే బయటకు అనుమతించాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన సీజేఐ.. ఢిల్లీ మెట్రో అధికారులతో సంప్రదించి ఈ అంశాన్ని పరిశీలించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు పరిపాలన విభాగాన్ని ఆదేశించినట్లు తెలిపారు.
‘‘ఈ ఉదయమే అధికారులకు సమాచారం ఇచ్చాను. వారు మెట్రో అధికారులతో చర్చిస్తున్నారు. ఇది ఒక సాధ్యమైన పరిష్కారంగా పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం వరకు సమస్య పరిష్కారమైతే మంచిదే. లేకపోతే నా జోక్యం అవసరమైతే నేను తప్పకుండా జోక్యం చేసుకుంటాను.’’ అని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు.
దేశ రాజధానిలో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) భద్రతా కారణాల దృష్ట్యా సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్తో పాటు మొత్తం 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!