WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC Final 2027 Venue Confirmed: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2027 ఫైనల్కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. 2027 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ను ఇంగ్లాండ్ లోని చారిత్రాత్మక ‘ది ఓవల్’ (The Oval) మైదానంలో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ 2027 జూన్ 9 నుంచి జూన్ 13 వరకు జరగనుంది.
ఇప్పటికే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కి 2027, 2029, 2031 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ నిర్వహణ హక్కులను ICC కేటాయించింది. ప్రతి ఎడిషన్కు వేదికను ఎంపిక చేసే బాధ్యత ECBదే. అందులో భాగంగానే 2027 ఫైనల్కు ది ఓవల్ను ఎంపిక చేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు ‘ది ఓవల్’ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో 2023 WTC ఫైనల్ కూడా ఇదే వేదికలో జరిగింది. ఆ ఫైనల్లో భారత్ను ఓడించిన ఆస్ట్రేలియా టెస్టు ఛాంపియన్గా నిలిచి టైటిల్ను సొంతం చేసుకుంది.
Also Read
- Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్ చివరి దశకు చేరుకుంటోంది. ఇంకా తొమ్మిది జట్లు ఫైనల్ రేసులో ఉన్నాయి. ప్రస్తుతం 87.5% పాయింట్ల శాతంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా 75%తో రెండో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 72.22%తో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత పాకిస్థాన్పై 2-0తో సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ 58.33% కూడా పోటీదారుగా నిలిచింది. రెండుసార్లు WTC ఫైనల్ ఆడిన భారత్ ప్రస్తుతం 48.15%తో ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాత శ్రీలంక 41.67%, ఇంగ్లాండ్ 24.36%, వెస్టిండీస్ 15%, పాకిస్థాన్ 8.33% ఉన్నాయి.
జూలై, ఆగస్టు నెలల్లో జరిగే టెస్టు సిరీస్లు WTC పాయింట్ల పట్టికను ప్రభావితం చేయనున్నాయి. ఇందులో జూలై 25 నుంచి వెస్టిండీస్-పాకిస్థాన్ మధ్య రెండు టెస్టుల సిరీస్, ఆగస్టు 13 నుంచి ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్, ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక రెండు టెస్టుల సిరీస్, ఆగస్టు-సెప్టెంబర్లో ఇంగ్లాండ్-పాకిస్థాన్ మూడు టెస్టుల సిరీస్ లు ఉన్నాయి. ఈ సిరీస్ల ఫలితాలు ఫైనల్కు చేరే రెండు జట్లను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
2027 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే ఏడాది టెస్టు క్రికెట్ ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో చారిత్రాత్మక ది ఓవల్లో ఫైనల్ నిర్వహించడం ఎంతో ప్రత్యేకమని ICC జనరల్ మేనేజర్ (ఈవెంట్స్ & ఆపరేషన్స్) గౌరవ్ సక్సేనా తెలిపారు. టెస్టు క్రికెట్ గొప్ప వారసత్వాన్ని ప్రపంచ అభిమానులకు మరోసారి గుర్తు చేసే వేదికగా ఈ ఫైనల్ నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభమైన తర్వాత జరిగిన మూడు ఎడిషన్లలో మూడు వేర్వేరు జట్లు విజేతలుగా నిలిచాయి. 2021లో న్యూజిలాండ్, 2023లో ఆస్ట్రేలియా, 2025లో దక్షిణాఫ్రికా విజేతలుగా నిలిచాయి. ఇప్పుడు 2027లో ఏ రెండు జట్లు ఫైనల్కు చేరుకుంటాయి? టైటిల్ను ఎవరు కైవసం చేసుకుంటారు? అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.
తాజావార్తలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్పై మరో బిగ్ క్లాష్!
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!