Rahul Gandhi: “అగ్ర కులాల చేతిలో దేశ సైన్యం”.. రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- భారత సైన్యంపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- అగ్ర కులాల చేతిలో సైన్యం ఉందని కామెంట్స్..
- బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కొత్త వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సైన్యం దేశ జనాభాలో 10 శాతం మంది (అగ్రకులాలను సూచిస్తూ) నియంత్రణలో ఉందని మంగళవారం అన్నారు. బీహార్ ఔరంగబాద్లో ప్రచారం చేస్తూ.. దేశ జనాభాలో 10 శాతం మందికి కార్పొరేట్ రంగాలు, బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థలో అవకాశాలు లభిస్తున్నాయి, సైన్యం కూడా వారి నియంత్రణలో ఉంది అని అన్నారు. మిగిలిన 90 శాతం, వెనుకబడిన తరగతులు, దళితులు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర మైనారిటీలు ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు.
మరోసారి, రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యల ద్వారా కుల గణన డిమాండ్ను మరోసారి లేవనెత్తారు. భారతదేశంలో వెనకబడి ఉన్న 90 శాతం మందిని గుర్తించి, వారికి హక్కులు, రాజ్యాంగ హామీలను రక్షించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 90 శాతం మందికి భాగస్వామ్య హక్కులు లేకపోతే, రాజ్యాంగాన్ని రక్షించలేమని అన్నారు.
Also Read
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
- Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు 'ప్రతీక్ యాదవ్' మృతి..!
Read Also: Pakistan: ట్రంప్ ‘‘అణు పరీక్ష’’ కామెంట్స్.. స్పందించిన పాకిస్తాన్..
దీనికి ముందు, భారత్ జోడో యాత్రలో అరుణాచల్ ప్రదేశ్లో చైనా దళాలు భారత సైనికుల్ని కొడుతున్నాయి అని రాహుల్ గతంలో వ్యాఖ్యానించారు. ఆగస్టులో ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 2022లో అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో జరిగిన భారత్-చైనా సైనిక ఘర్షణను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2000 చ.కి.మీ భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి అని రాహుల్ ఆరోపించారు.
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎ.జి. మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ‘‘2000 చ.కి.మీ భూమిని చైనా స్వాధీనం చేసుకుందని మీకు ఎలా తెలిసింది.? మీరు నిజమై భారతీయులైతే, ఇలాంటివి చెప్పరు’’ అని జస్టిస్ దత్తా రాహుల్ గాంధీని తీవ్రంగా మందలించారు.
తాజావార్తలు
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!