Rahul Gandhi: “అగ్ర కులాల చేతిలో దేశ సైన్యం”.. రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- భారత సైన్యంపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- అగ్ర కులాల చేతిలో సైన్యం ఉందని కామెంట్స్..
- బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కొత్త వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సైన్యం దేశ జనాభాలో 10 శాతం మంది (అగ్రకులాలను సూచిస్తూ) నియంత్రణలో ఉందని మంగళవారం అన్నారు. బీహార్ ఔరంగబాద్లో ప్రచారం చేస్తూ.. దేశ జనాభాలో 10 శాతం మందికి కార్పొరేట్ రంగాలు, బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థలో అవకాశాలు లభిస్తున్నాయి, సైన్యం కూడా వారి నియంత్రణలో ఉంది అని అన్నారు. మిగిలిన 90 శాతం, వెనుకబడిన తరగతులు, దళితులు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర మైనారిటీలు ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు.
మరోసారి, రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యల ద్వారా కుల గణన డిమాండ్ను మరోసారి లేవనెత్తారు. భారతదేశంలో వెనకబడి ఉన్న 90 శాతం మందిని గుర్తించి, వారికి హక్కులు, రాజ్యాంగ హామీలను రక్షించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 90 శాతం మందికి భాగస్వామ్య హక్కులు లేకపోతే, రాజ్యాంగాన్ని రక్షించలేమని అన్నారు.
Also Read
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
Read Also: Pakistan: ట్రంప్ ‘‘అణు పరీక్ష’’ కామెంట్స్.. స్పందించిన పాకిస్తాన్..
దీనికి ముందు, భారత్ జోడో యాత్రలో అరుణాచల్ ప్రదేశ్లో చైనా దళాలు భారత సైనికుల్ని కొడుతున్నాయి అని రాహుల్ గతంలో వ్యాఖ్యానించారు. ఆగస్టులో ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 2022లో అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో జరిగిన భారత్-చైనా సైనిక ఘర్షణను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2000 చ.కి.మీ భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి అని రాహుల్ ఆరోపించారు.
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎ.జి. మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ‘‘2000 చ.కి.మీ భూమిని చైనా స్వాధీనం చేసుకుందని మీకు ఎలా తెలిసింది.? మీరు నిజమై భారతీయులైతే, ఇలాంటివి చెప్పరు’’ అని జస్టిస్ దత్తా రాహుల్ గాంధీని తీవ్రంగా మందలించారు.
తాజావార్తలు
-
Astrology: జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. జీవితంలో అద్భుతమైన మార్పులు.. ఇవే ఆ సంకేతాలు!
-
Prabhas Movies : డిసెంబర్ 3న ‘ఫౌజీ’ విడుదల.. ప్రభాస్ను నమ్మొచ్చా.. కన్ఫర్మ్గా వస్తాడా?
-
COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!