Operation Sindoor: ‘‘మాట వినకుంటే పాక్ ఖతం అయ్యేది’’.. టాప్ ఆర్మీ అధికారి సంచలనం..
- పాక్ మాట వినకుంటే ఘోరమైన విపత్తు జరిగేది..
- అరేబియా సముద్రంలో సిద్ధంగా నేవీ ఉంది..
- సంచలన విషయాలు చెప్పిన ఆర్మీ అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, భారత్ను దాడులు ఆపేయాలని కోరకుంటే, అది వారికి ఘోరమైన విపత్తుగా మారేదని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మంగళవారం అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత, మే నెలలో భారత్ పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలతో పాటు ఆ దేశ వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. నాలుగు రోజుల ఈ సైనిక ఘర్షణ తర్వాత, పాకిస్తాన్ బ్రతిమిలాడటంతో భారత్ సైనిక చర్యను నిలిపేసింది.
Read Also: Juice: జ్యూస్ తాగి 15 గంటల పాటు నిద్రపోయిన పలువురు వ్యక్తులు.. ఆ ముస్లిం యువకుడు ఎవరు?
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
ఆ సమయంలో భారత్ నేవీ అరేబియా సముద్రంలో మోహరించబడినట్లు రాజీవ్ ఘాయ్ తెలిపారు. మిలిటరీ యాక్షన్కు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘‘భారతదేశ నావికా దళం చాలా సిద్ధంగా ఉంది. బహుశా ఇది అందరికి తెలియకపోవచ్చు. అరేబియా సముద్రంలో నేవీ మోహరించబడింది. ’’ అని ఐక్యరాజ్యసమితి దళాల సహకార దేశాల (UNTCC) చీఫ్స్ కాన్క్లేవ్లో ఆపరేషన్ సిందూర్లో మాట్లాడుతున్న లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ అన్నారు.
ఒక వేళ పాకిస్తాన్ వినకపోయి ఉంటే, అది వారికి ఘోరమైన విపత్తుగా మారేదని ఆయన చెప్పారు. కేవలం సముద్రం నుంచే కాకుండా, ఇతర మార్గాల ద్వారా కూడా వారు పెను విపత్తును ఎదుర్కొనేవారని ఆయన చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా వ్యూహాలలో సిద్ధాంతపరమైన మార్పులు జరిగాయని చెప్పారు. భారత ప్రధాని మోడీ చెప్పి విషయాలను రాజీవ్ ఘాయ్ మరోసారి గుర్తు చేశారు. ఉగ్రవాద దాడుల్ని యుద్ధ చర్యగా భావిస్తామని, అణు బ్లాక్మెయిల్లకు ఇక లొంగేది లేదని, ఉగ్రవాదులు వారిని ప్రోత్సహించే వారి మధ్య ఎలాంటి తేడా చూపబోం అని చెప్పారు. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గరు ఉగ్రవాదుల్ని సైన్యం హతమార్చింది.
#WATCH | Delhi | Director General Military Operations Lt Gen Rajiv Ghai says, "The Indian Navy was also in action… The Navy had sailed into the Arabian Sea and when the DGMO spoke, they were very well poised. Had the enemy decided to take it any further, it could have been… pic.twitter.com/lK5dhQkHY6
— ANI (@ANI) October 14, 2025
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!