Operation Sindoor: ‘‘మాట వినకుంటే పాక్ ఖతం అయ్యేది’’.. టాప్ ఆర్మీ అధికారి సంచలనం..
- పాక్ మాట వినకుంటే ఘోరమైన విపత్తు జరిగేది..
- అరేబియా సముద్రంలో సిద్ధంగా నేవీ ఉంది..
- సంచలన విషయాలు చెప్పిన ఆర్మీ అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, భారత్ను దాడులు ఆపేయాలని కోరకుంటే, అది వారికి ఘోరమైన విపత్తుగా మారేదని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మంగళవారం అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత, మే నెలలో భారత్ పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలతో పాటు ఆ దేశ వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. నాలుగు రోజుల ఈ సైనిక ఘర్షణ తర్వాత, పాకిస్తాన్ బ్రతిమిలాడటంతో భారత్ సైనిక చర్యను నిలిపేసింది.
Read Also: Juice: జ్యూస్ తాగి 15 గంటల పాటు నిద్రపోయిన పలువురు వ్యక్తులు.. ఆ ముస్లిం యువకుడు ఎవరు?
Also Read
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
- Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
- Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
ఆ సమయంలో భారత్ నేవీ అరేబియా సముద్రంలో మోహరించబడినట్లు రాజీవ్ ఘాయ్ తెలిపారు. మిలిటరీ యాక్షన్కు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘‘భారతదేశ నావికా దళం చాలా సిద్ధంగా ఉంది. బహుశా ఇది అందరికి తెలియకపోవచ్చు. అరేబియా సముద్రంలో నేవీ మోహరించబడింది. ’’ అని ఐక్యరాజ్యసమితి దళాల సహకార దేశాల (UNTCC) చీఫ్స్ కాన్క్లేవ్లో ఆపరేషన్ సిందూర్లో మాట్లాడుతున్న లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ అన్నారు.
ఒక వేళ పాకిస్తాన్ వినకపోయి ఉంటే, అది వారికి ఘోరమైన విపత్తుగా మారేదని ఆయన చెప్పారు. కేవలం సముద్రం నుంచే కాకుండా, ఇతర మార్గాల ద్వారా కూడా వారు పెను విపత్తును ఎదుర్కొనేవారని ఆయన చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా వ్యూహాలలో సిద్ధాంతపరమైన మార్పులు జరిగాయని చెప్పారు. భారత ప్రధాని మోడీ చెప్పి విషయాలను రాజీవ్ ఘాయ్ మరోసారి గుర్తు చేశారు. ఉగ్రవాద దాడుల్ని యుద్ధ చర్యగా భావిస్తామని, అణు బ్లాక్మెయిల్లకు ఇక లొంగేది లేదని, ఉగ్రవాదులు వారిని ప్రోత్సహించే వారి మధ్య ఎలాంటి తేడా చూపబోం అని చెప్పారు. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గరు ఉగ్రవాదుల్ని సైన్యం హతమార్చింది.
#WATCH | Delhi | Director General Military Operations Lt Gen Rajiv Ghai says, "The Indian Navy was also in action… The Navy had sailed into the Arabian Sea and when the DGMO spoke, they were very well poised. Had the enemy decided to take it any further, it could have been… pic.twitter.com/lK5dhQkHY6
— ANI (@ANI) October 14, 2025
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?