ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఇండియాలో 58,097 కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం రోజున 37 వేలకు పైగా కేసులు నమోదవ్వగా ఒక్కరోజులో కొత్తగా 20 వేలకు పైగా కేసులు పెగరడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియాలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.18 శాతంగా ఉంది. ఇది అందోళన కలిగించే అంశంగా చెప్పాలి. ఇక 24 గంటల్లో 15,389 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కేసులతో పాటు మరణాల సంఖ్యకూడా భారీగా పెరిగింది. 24 గంటల్లో…
కియా నుంచి మరో కొత్త కారు రిలీజ్ కాబోతున్నది. ఇప్పటికే మూడు కియా కార్లు ఇండియాలో రిలీజ్ కాగా, ఇప్పుడు నాలుగో కారును రిలీజ్ చేయబోతున్నారు. కియా కరెన్స్ అనే ప్రీమియం రేంజ్ కారును రిలీజ్ చేయనున్నారు. ఈనెల 14 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. 7 సీట్ల సామర్థ్యంతో రిలీజ్ కాబోతున్న కరెన్స్ 8 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉండబోతున్నట్టు కియా పేర్కొన్నది. కియా నుంచి ఇప్పటికే సెల్టోస్, సొనెట్, కార్నివాల్తో పోలిస్తే కరెన్స్ డిజైన్…
కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో భారత్లో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 37,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 124 మంది కరోనాతో చనిపోయారు. రోజువారీ పాజిటివ్ రేటు పెరిగి 3.24 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. Read Also: సంక్రాంతి బస్సులు: ఏపీఎస్ఆర్టీసీ…
ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ ఛైర్మన్ డా. ఎన్కే అరోరా స్పష్టం చేశారు. ముంబై, ఢిల్లీ, కోల్కతాలో నమోదవుతున్న కేసుల్లో 75 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్వే అని ఆయన తెలిపారు. గత ఏడాది డిసెంబర్ తొలి వారంలో మొదటి ఒమిక్రాన్ కేసును గుర్తించగా రెండు వారాల్లోనే ఈ వేరియంట్ దేశమంతటా వ్యాపించిందని పేర్కొన్నారు. డిసెంబర్ తొలివారం నుంచి చివరి వారం వరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 12 శాతం…
దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో అంతకంతకూ పెరుగుతున్న వేళ బీమా నియంత్రణ, అధివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ గుడ్న్యూస్ చెప్పింది. కరోనా ఆరోగ్య బీమా పాలసీల్లో ఒమిక్రాన్ చికిత్సకు చేసిన ఖర్చులు కూడా కవరేజీ అవుతాయని ప్రకటించింది. సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు జారీ చేసిన అన్నిరకాల ఆరోగ్య బీమా పాలసీల్లో కరోనా చికిత్సకు పరిహారం ఇవ్వాలని ఐఆర్డీఏఐ గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో తన ఆదేశాలను…
దేశంలో కరోనా కేసులు అంతకంతకు భారీగా పెరుగుతున్నాయి. 20 నుంచి 30 శాతం మేర కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. ఒమిక్రాన్ కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. థర్డ్ వేవ్ వచ్చినా ఇబ్బందులు లేకుండా మందులు, ఆసుపత్రులు, ఆక్సీజన్ను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగితే దాని ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుందని, వైద్యరంగంపై పెనుభారం పడుతుందని,…
డ్రైవర్ జాగ్రత్తగా నడిపితేనే ఎవరైనా గమ్యాన్ని చేరేది.. ఇక, కార్లు, బస్సులు, పెద్ద వాహనాలు నడిపేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.. అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ డ్రైవర్కు ఏకంగా 190 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.. బస్సు ప్రమాదంలో 22 మంది సజీవదహనానికి కారణమైన ఆ డ్రైవర్కు 10 ఏళ్ల చొప్పున 19 విడతలుగా జైల్లో గడపాలని తీర్పు వెలువరించింది మధ్యప్రదేశ్లోని ఓ కోర్టు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read…
భారత్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు తీవ్రస్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజాగా భారత్లో 33,750 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దేశంలో మొత్తం 3,42,95,407 మంది కోలుకున్నారని, నిన్న ఒక్కరోజులో 10,846 మంది కోలుకున్నట్టు బులిటెన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 1,45,582 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 123 మంది మృతి చెందారు. దీంతో భారత్లో ఇప్పటి వరకు కరోనాతో మృతి…
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ సాగుతోంది.. భారత్లోనూ ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ డోస్ వంద శాతం పూర్తిచేశారు.. సెకండ్ డోస్ వేస్తున్నారు.. ఇక, టీనేజర్లకు కూడా టీకా వేసేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా 15 – 18 ఏళ్ల వయసు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…
ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమలవుతుండగా… ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మరో అడుగు ముందుకేసింది. దాదాపు లాక్డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. సోమవారం నుంచి విద్యాసంస్థలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, పార్కులు మూసివేస్తున్నట్లు తెలిపింది. Read Also: కలవరపెడుతున్న ఒమిక్రాన్… తెలంగాణలో 84కి చేరిన కేసులు మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ,…