నేటి నుంచి వీరికి కూడా వ్యాక్సినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ సాగుతోంది.. భారత్లోనూ ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ డోస్ వంద శాతం పూర్తిచేశారు.. సెకండ్ డోస్ వేస్తున్నారు.. ఇక, టీనేజర్లకు కూడా టీకా వేసేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా 15 – 18 ఏళ్ల వయసు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం వీరందరికీ కోవాగ్జిన్ టీకాల పంపిణీకి అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. జిల్లాల వారీగా ఉన్న 15-18 ఏజ్ గ్రూప్ గణాంకాలను తీసి.. మాకు ఇన్ని టీకాలు కావాలని ప్రభుత్వానికి చెప్పడం.. ఆ మెరకు వారికి వ్యాక్సిన్లు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను నేటి నుంచి ప్రారంభం అవుతుండగా.. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆదేశించినట్లుగా, భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ టీకాను మాత్రమే ఇవ్వనున్నారు.. డిసెంబర్ 25, 2021న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కరోనా టీకాలు వేయడానికి ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ కార్మికులు మరియు పౌరులకు మూడో డోసు కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.. అందులో భాగంగా.. ఈ నెల 10వ తేదీ నుంచి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న 60 ఏళ్లు పైబడినవారికి బూస్టర్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!