జోహన్నెస్ బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట ప్రారంభం కాలేదు. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో పిచ్ మొత్తాన్ని అంపైర్లు కవర్లతో కప్పి ఉంచారు. ఇరుజట్లకు నాలుగోరోజు కీలకంగా మారింది. భారత్ విజయం సాధించాలంటే 8 వికెట్లు తీయాల్సి ఉండగా… దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 122 పరుగులు చేయాల్సి ఉంది. Read Also: 30 ఏళ్లకే క్రికెటర్ రిటైర్మెంట్.. బోర్డు నిర్ణయమే కారణమా?…
టీమిండియా టెస్ట్ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ త్వరలోనే అరుదైన మైలురాయిని చేరబోతున్నాడు. టెస్టు కెరీర్లో అతడు వందో టెస్టును ఆడనున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో మూడో టెస్ట్ ఆడితే 99వ టెస్టు ఆడనున్న కోహ్లీ… సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే సిరీస్లో 100వ టెస్టు మజిలీకి చేరుకోనున్నాడు. ఆ టెస్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతోంది. సుదీర్ఘ కాలంలో ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సేవలు అందిస్తున్న కోహ్లీ… తన వందో టెస్టును బెంగళూరులో…
యువ భారత్ కదులుతోంది.. వ్యాక్సినేషన్ సెంటర్ల వైపు అడుగులు వేస్తోంది.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైకా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.. 15-18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సినేషన్కు ప్రభుత్వం అనుమతించిన తరుణంలో.. కేవలం మూడు రోజుల్లోనే కోటి మందికి పైగా టీనేజర్లు వ్యాక్సిన్ వేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.. మూడు రోజుల్లో కోటి మంది టీనేజర్లు కోవిడ్టీకాపంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. వ్యాక్సిన్వేయించుకోవడానికి ఉత్సాహం చూపుతున్న యువతను అభినందించారు…
దేశంలో ఒమిక్రాన్ కారణంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు మళ్లీ పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టాక కొన్ని ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ను ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ ముప్పు పెరుగుతుండటంతో ఆయా సంస్థలు మళ్లీ ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశాయి. సోమవారం నుంచే కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పనిచేయటం ప్రారంభించగా… బుధవారం…
దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కాకినాడ కాజాకు అరుదైన గుర్తింపు లభించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాకినాడ గొట్టం కాజాను నేటి తరం గుర్తించేందుకు ప్రత్యేక పోస్టల్ కవర్ను తపాల శాఖ విడుదల చేసింది. 1891లో తొలిసారిగా కాకినాడ కాజాను తయారుచేశారు. కోటయ్య అనే వ్యక్తి తొలిసారిగా ఈ కాజాను తయారు చేసి కీర్తిని పొందారు. 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాజాకు జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యం కల్పించి అంతర్జాయంగా మరింత ప్రచారం కల్పించింది.…
భారత్లో కరోనా సునామీ మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. బుధవారం 58000 కరోనా కేసులు నమోదు కావటం తీవ్రతను తెలియజేస్తోంది. గత తొమ్మిది రోజులతో పోలిస్తే కేసులు ఆరు రెట్లు పెరిగాయి. రాబోవు కాలంలో ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అంచనా వేయటం కూడా కష్టమే. మరోవైపు, దేశంలో ఒమిక్రాన్ కేసులు రెండు వేలకు దగ్గరయ్యాయి. పాజిటివ్గా నిర్ధారణ అయిన విదేశీ ప్రయాణికులలో ఎక్కువగా ఒమిక్రాన్ కేసులే ఉంటున్నాయి. థర్డ్వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు కట్టడి…
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేసులు పెరుగుతున్న ట్రెండ్ చూస్తుంటే థర్డ్వేవ్ వచ్చినట్లు క్లియర్గా కనిపిస్తోంది. వారం రోజుల తేడాలో దాదాపు 44 వేల కరోనా కేసులు పెరిగాయి. వారం క్రితం 13వేలు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ప్రస్తుతం 58వేల మార్కుకు చేరుకున్నాయి. Read Also: భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు… మరణాలు గత వారం రోజులుగా నమోదైన కేసుల…
ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఇండియాలో 58,097 కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం రోజున 37 వేలకు పైగా కేసులు నమోదవ్వగా ఒక్కరోజులో కొత్తగా 20 వేలకు పైగా కేసులు పెగరడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియాలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.18 శాతంగా ఉంది. ఇది అందోళన కలిగించే అంశంగా చెప్పాలి. ఇక 24 గంటల్లో 15,389 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కేసులతో పాటు మరణాల సంఖ్యకూడా భారీగా పెరిగింది. 24 గంటల్లో…
కియా నుంచి మరో కొత్త కారు రిలీజ్ కాబోతున్నది. ఇప్పటికే మూడు కియా కార్లు ఇండియాలో రిలీజ్ కాగా, ఇప్పుడు నాలుగో కారును రిలీజ్ చేయబోతున్నారు. కియా కరెన్స్ అనే ప్రీమియం రేంజ్ కారును రిలీజ్ చేయనున్నారు. ఈనెల 14 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. 7 సీట్ల సామర్థ్యంతో రిలీజ్ కాబోతున్న కరెన్స్ 8 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉండబోతున్నట్టు కియా పేర్కొన్నది. కియా నుంచి ఇప్పటికే సెల్టోస్, సొనెట్, కార్నివాల్తో పోలిస్తే కరెన్స్ డిజైన్…